ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చి పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా పలు రికార్డులను షేక్ చేసింది. అలాగే ఇందులో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలో అల్లు అర్జున్, సమంత కలిసి వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఇక మాస్ ఆడియన్స్ అయితే ఈ పాటకు పూనకంతో ఊగిపోయారు. కాగా ఇప్పుడీ పాట క్రేజ్ ఖండతారాలు దాటిపోయింది.
ఆగస్టు 7న అమెరికాలోని ఫ్లోరిడాలో భారత్-వెస్టిండీస్ మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన భారత అభిమానులు.. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ పాటకు స్టెప్పులేస్తూ రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్రికెట్ అభిమానులు మ్యాచ్ మజాతో పాటు మాస్ సాంగ్తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. మరి అభిమానుల డాన్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి
Oo Antava song at Central Broward Park & Broward County Stadium
Lauderhill, Florida#AlluArjun𓃵 #AlluArjunArmy #AlluArjunArmyApp #AlluBhai One Man Army 🦁#AlluArjun #AlluSnehaReddy #Pushpa #PushpaRaj #PushpaTheRise #PushpaTheRule #ThaggedheLe🤙#AlluNaseer_ @alluarjun pic.twitter.com/n8qqblOwVu— Allu Naseer (@allunaseer_) August 9, 2022