కామన్ వెల్త్ గేమ్స్-2022కు ముందు భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ స్ప్రింటర్ ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్యబాబు డోప్ టెస్టులో పట్టుబడ్డారు. దీంతో వీరిద్దరు కామన్ వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నారు. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ బుధవారం నిర్వహించిన డోప్ టెస్టులో ధనలక్ష్మి నిషేధిత స్టెరాయిడ్ తీసుకున్నట్లు తేలింది. బర్మింగ్హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగష్టు 8 వరకు కామన్ వెల్త్ గేమ్స్ జరగనున్నాయి.
కామన్వెల్త్ క్రీడల్లో స్ప్రింటర్ ధనలక్ష్మి 100 మీటర్ల పరుగు పందెంతోపాటు 4×100 మీటర్ల రిలే రేస్లో కూడా పాల్గొనాల్సి ఉంది. అదే సమయంలో నేషనల్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్స్లో భాగంగా సేకరించిన ఐశ్వర్య శాంపిల్స్ కూడా పాజిటివ్ ఫలితాన్నిచ్చినట్లు నాడా అధికారులు తెలిపారు. దీంతో వీళ్లిద్దరూ కూడా కామన్వెల్త్ క్రీడలకు దూరం కానున్నారు.
కాగా ధనలక్ష్మి గతేడాది 100 మీటర్ల రేసులో స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ను ఓడించి సంచలనం సృష్టించింది. దీంతో పాటు గత నెలలో ధనలక్ష్మి 200 మీటర్ల పరుగుల రేసులో పరుగుల చిరుత హిమదాస్పై విజయం సాధించింది. ఇక ఐశ్వర్యబాబు విషయానికి వస్తే.. గత నెలలో చెన్నైలో జరిగిన జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సందర్భంగా నాడా అధికారులు ఐశ్వర్య శాంపిల్ను తీసుకున్నారు. తాజాగా ఆమె కూడా నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు తేలింది. ఆమె కామన్ వెల్త్ గేమ్స్-2022కు ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్ ఈవెంట్లకు ఆమె ఎంపికైంది. పథకాలు తీసుకొస్తారనుకున్న అథ్లెట్లు.. ఇలా డోప్ టెస్టులో పట్టుబడడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: KL Rahul: హీరోయిన్ అతియా శెట్టితో కేఎల్ రాహుల్ పెళ్లి వాయిదా!
ఇది కూడా చదవండి: వీడియో: ఫామ్ లోకి రావడానికి కోహ్లీ కుస్తీలు!