ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభానికి కొన్ని రోజులే ఉంది. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్, ఓపెనర్ రిజ్వాన్ న్యూజిలాండ్లో హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో ట్రైసిరీస్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పాక్ ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ ఇద్దరూ హాఫ్ సెంచరీలో చేశారు. వరల్డ్ కప్కు ముందు వారిద్దరూ మంచి ప్రదర్శన ఇవ్వడం ఆ జట్టుకు శుభపరిణామమే. కానీ.. పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు మాత్రం ఈ హాఫ్ సెంచరీలతో హ్యాపీగా లేరు. పైగా ఇద్దరినీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం ఇద్దరూ కేవలం హాఫ్ సెంచరీల కోసమే ఆడుతున్నట్లు ఉండటమే. వన్డే మ్యాచ్ స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేస్తూ.. సాధించే ఈ హాఫ్ సెంచరీలు దేనికంటూ మండిపడుతున్నారు.
గురువారం జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు త్వరగానే అవుటైనా.. లింటన్ దాస్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 69, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులు చేసి రాణించడంతో.. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 173 పరుగుల స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో నసీమ్ షా రెండు వికెట్ల పడగొట్టాడు. ఇక 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్కు ఓపెనర్లు మొహమ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర అజమ్ మంచి భాగస్వామ్యం అందించారు. తొలి వికెట్కు 101 పరుగులు జోడించి.. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత మొహమ్మద్ నవాజ్ 20 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సుతో 45 పరుగులతో అదరగొట్టాడు. దీంతో 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి పాక్.. విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్లో బాబర్ అజమ్, రిజ్వాన్ ఆడిన ఇన్నింగ్స్లపై విమర్శల వర్షం కురుస్తోంది.
56 బంతులు ఆడిన రిజ్వాన్ 4 ఫోర్లతో 69 పరుగులు చేశాడు. బాబర్ 40 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి ఇన్నింగ్స్ల్లో ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం. పైగా.. రిజ్వాన్ 123, బాబర్ 137 వంటి సాధారణ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. బంగ్లా జట్టులోనూ ఇద్దరు ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేశారు. వాళ్లిద్దరి స్ట్రైక్రేట్ 160పైనే ఉంది. ఇదే విషయం పాక్ ఫ్యాన్స్కు కోపం తెప్పించింది. వన్డే స్ట్రైక్రేట్తో టీ20 మ్యాచ్లు ఆడితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నీకి కొన్ని రోజుల ముందు ఇలాంటి ఇన్నింగ్స్తో ఏం సాధిస్తారని మండిపడుతున్నారు. పైగా టీ20 ర్యాంకింగ్స్లో రిజ్వాన్ మొదటి స్థానంలో ఉండగా, బాబర్ అజమ్ మూడో స్థానంలో ఉన్నారు. అలాంటి టాప్ ర్యాంకింగ్స్లో ఉన్న ప్లేయర్లు ఇలాంటి ఇన్నింగ్స్లా ఆడేది అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. వీరిద్దరి స్ట్రైక్ రేట్పై గతంలో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.
Pakistan beat Bangladesh by seven wickets with the help of fifties from Babar Azam, Mohammad Rizwan and a fine cameo of 45*(20) from Mohammad Nawaz.
#PAKvBAN pic.twitter.com/O0QEb78uI8
— CricTracker (@Cricketracker) October 13, 2022