ఆసియా కప్ 2022లో టీమిండియా గ్రూప్ స్టేజ్లో అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను మట్టికరిపించింది. ఆ తర్వాత హాంకాంగ్పై ఓ మోస్తారు విజయంతో సూపర్ ఫోర్కు చేరింది. మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించినా.. ఫైనల్కు చేరే అవకాశం ఉండటంతో టీమిండియా కచ్చితంగా ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. కానీ.. పాకిస్థాన్, శ్రీలంక టీమిండియాను ఓడించి షాకిచ్చాడు. దీంతో టీమిండియా ఫైనల్ అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక చేతిలో భారత్ ఓడింది. ఈ ఓటమి తర్వాత కూడా ఫైనల్ అవకాశాలు.. 0.01 పర్సెంట్ కనిపించాయి. అదేలా అంటే అఫ్ఘనిస్థాన్ పాకిస్థాన్ను ఓడించాలి, టీమిండియా అఫ్ఘనిస్థాన్ను ఓడించాలి, శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోవాలి. ఈ మూడు మ్యాచ్లకు ముందు ఈ సమీకరణాలు చాలా సంక్లిష్టంగా దాదాపు అసాధ్యంగా అనిపించాయి.
తీరా.. సూపర్ ఫోర్ ముగిసే సరికి.. ఈ సమీకరణాలన్ని దాదాపు అనుకున్న విధంగానే జరిగాయి. అఫ్ఘనిస్థాన్ను భారీతో తేడాతో ఓడించి టీమిండియా మంచి రన్రేట్ సంపాదించింది. శ్రీలంక కూడా పాకిస్థాన్ను ఓడించి.. అఫ్ఘనిస్థాన్ పాక్ను ఓడించేంత పని చేసింది. నిజానికి ఆ మ్యాచ్ అఫ్ఘనిస్థాన్ గెలవాలి. 18వ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన ఫారూఖీ చివరి ఓవర్లో ఒత్తిడికి చిత్తై తొలి రెండు బంతులను టాస్ బాల్స్ వేసి రెండు సిక్సులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో డిఫెండ్ చేయడానికి అతని వద్ద 11 పరుగులు ఉన్నాయి. అతను 18వ వేసిన విధానం చూస్తే.. 11 రన్స్ను అతను ఈజీగా డిఫెండ్ చేయడగలడనిపించింది. అప్పటికే పాక్ 9 వికెట్లు కోల్పోయింది. క్రీజ్లో స్పెషలిస్ట్ బ్యాటర్ కూడా లేడు. బ్యాట్ కూడా సరిగా పట్టుకోవడం రాని టెయిలెండర్ నసీమ్ షా ఉన్నాడు. కానీ.. ఫారూఖీ మాత్రం ఒత్తిడిలో రెండు ఫుల్ టాస్ బంతులు వేయడంతో నసీమ్ షా లడ్డుల్లా దొరికిన బంతిని కసితీరా బాదడంతో అవి రెండు సిక్సులుగా వెళ్లాయి. దీంతో ఓడిపోవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ గెలిచింది. టీమిండియా ఇంటికి వెళ్లింది.
ఆఫ్ఘాన్ బౌలర్ ఫారూఖీ ఆ ఓవర్ కరెక్ట్గా వేసి ఉంటే.. ఆఫ్ఘాన్ ఆ మ్యాచ్ గెలిచి ఉండేది. ఈ ఆదివారం శ్రీలంకతో టీమిండియా ఆసియా కప్ ఫైనల్ ఆడాది. శ్రీలంక చేతిలో టీమిండియాకి కూడా పెద్దగా బాధపడని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్.. పాకిస్థాన్పై ఆఫ్ఘాన్ ఓటమిపై ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఒక్క మ్యాచ్ అఫ్ఝనిస్థాన్ గెలిచి ఉంటే.. తర్వాత అన్ని టీమిండియాకు అనుకూలంగానే జరిగాయి. టాస్ ఎంతో కీలకమైన పిచ్లపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడమే టీమిండియా ఓటములకు ప్రధాన కారణం. ఇదే విషయాన్ని రోహిత్ కూడా ప్రస్తావించాడు. ఇక పోతే సూపర్ ఫోర్లో మూడు విజయాలతో శ్రీలంక, రెండు గెలుపులతో పాకిస్థాన్ ఆదివారం(సెప్టెంబర్ 11) ఆసియా కప్ 2022 ఫైనల్ ఆడనున్నాయి. మరి ఆసియా కప్లో టీమిండియా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సెంచరీ తర్వాత కోహ్లీతో రోహిత్ స్పెషల్ ఇంటర్వ్యూ! ఆసక్తికర విషయాలు వెల్లడి..
Relive the moment when @iNaseemShah made history in Sharjah – the home of iconic Pakistan 6s!
🇵🇰Zindabad #NaseemShah #PakvsAfg #AsiaCup2022 pic.twitter.com/mDt0HShsDR— PTV Sports (@PTVSp0rts) September 7, 2022