టీమిండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేశాడు. విరాట్ కోహ్లీ 71వ సెంచరీ తర్వాత ఈ స్పెషల్ ఇంటర్వ్యూ జరిగింది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ప్రశ్నలకు విరాట్ ఆసక్తికర సమాధానాలు వెల్లడించాడు. ఇద్దరి మధ్య నవ్వులు విరబూశాయి. ఈ ఇద్దరు స్టార్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫ్యాన్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత కోహ్లీ సెంచరీ చేయడం, రోహిత్ అతన్ని సరదాగా ఇంటర్వ్యూ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని ఎలాంటి ప్రశ్నలు ఆడిగాడు.. అందుకు కోహ్లీ ఏం సమాధానం ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా కాలం కోహ్లీ 71వ సెంచరీ చేయడంపై అతని శుభాకాంక్షలు తెలుపుతూ రోహిత్ ఇంటర్వ్యూ ప్రారంభించాడు. కోహ్లీ సెంచరీపై, జట్టులో తన రోల్ గురించి, రాబోయే సిరీస్లు, తమ లక్ష్యాల గురించి రోహిత్ కోహ్లీని ప్రశ్నించాడు. దీనికి కోహ్లీ సమాధానం ఇస్తూ.. ‘చాలా కాలం తర్వాత సెంచరీ రావడం చాలా సంతోషం ఉంది. 13, 14 ఏళ్ల పాటు నిర్విరామంగా క్రికెట్ ఆడిన నేను.. కొంత గ్యాప్ తీసుకోవడం చాల మంచి చేసింది. నాదికాని ఆట ఆడేందుకు ప్రయత్నించి చాలా ఇబ్బంది పడ్డాను.. కానీ.. జట్టు అవసరానికి తగ్గట్టు ఆడటంతో నా పాత రిథమ్, టెంప్లేట్ను అందుకోగలిగాను. ఈ విషయంలో మీరు, టీమ్ మేనేజ్మెంట్ మంచి సహకారం అందించారు. నా ఆట నన్ను ఆడుకోనివ్వడంతో.. నేను చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాను. కానీ.. టీ20 ఫార్మాట్లో నా 71వ సెంచరీ చేస్తానని మాత్రం అనుకోలేదు. ప్రస్తుతం జట్టుకు నా అవసరం ఏంటనే దానిపైనే నా దృష్టంతా ఉంది. జట్టు అవసరానికి తగ్గట్లు .. బాధ్యతగా ఆడటంతో పాటు రన్రేట్ పెంచాలంటే హిట్టింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లు మన అందరి లక్ష్యం ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్. దానికి తగ్గట్లు మనం సిద్ధం అవుతున్నాం. అలాగే కేఎల్ రాహుల్కి కూడా కొంత టైమ్ ఇవ్వాలి. అతను ఫామ్లోకి వస్తే.. టీ20 వరల్డ్ కప్ సమయానికి మన టీమ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది’ అని కోహ్లీ వివరంగా చెప్పుకొచ్చాడు. అలాగే రోహిత్ శర్మ కూడా రాబోయే టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగానే సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. కానీ.. అక్కడ కూడా టాస్ కీలకంగా మారొద్దని ఆశించాడు. ఎందుకంటే ఆసియా కప్లో టీమిండియా సూపర్ ఫోర్లో ఆడిన మూడు మ్యాచ్లలో ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు. యూఏఈ పిచ్లపై టాస్ కీలకంగా మారింది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే టీమ్కు పిచ్ అనుకూలంగా మారింది. దీంతో టీమిండియా విజయావకాశాలు దెబ్బతిన్నాయి. పాకిస్థాన్, శ్రీలంకతో మ్యాచ్లలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మంచి స్కోర్ సాధించినా.. రెండు ఇన్నింగ్స్కు పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించడంతో బౌలర్లు విఫలం అయ్యారు. దీంతో టీమిండియా సూఫర్ ఫోర్లో తొలి రెండు మ్యాచ్లు ఓడి.. ఆసియా కప్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ అనుభవంతో.. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్లో ఇలా టాస్ మ్యాచ్ ఫలితాలను శాసించొద్దని రోహిత్ కోరుకుంటున్నాడు. మరి ఆసియా కప్లో టీమిండియా ప్రదర్శన, కోహ్లీ సెంచరీ, రోహిత్-కోహ్లీ ఇంటర్వ్యూ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: కోహ్లీ గురించి ఆడిగితే ఇరిటేట్ అయిన కేఎల్ రాహుల్! ఊహించని రిప్లై What happens when @ImRo45 interviews @imVkohli ☺️ Laughs, mutual admiration & a lot of respect - by @ameyatilak Full interview ️https://t.co/8bVUaa0pUw #TeamIndia | #AsiaCup2022 | #INDvAFG pic.twitter.com/GkdPr9crLh — BCCI (@BCCI) September 9, 2022