అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొంతమంది అభిమానులు గ్రౌండ్లోకి అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చి.. తమ అభిమాన ఆటగాడిని కౌగిలించుకోవటం, షేక్హ్యాండ్ ఇవ్వటం వంటి సంఘటనలు చాలా జరిగాయి. మ్యాచ్ జరుగుతుండగా కొన్ని సార్లు కుక్కలు వచ్చి.. మ్యాచ్కు అంతరాయం కలిగించాయి కూడా. తాజాగా భారత్-సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా ఏకంగా పాము కూడా గ్రౌండ్లోకి వచ్చింది. కానీ.. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక క్రికెట్ అభిమాని ఏకంగా బట్టలు లేకుండా పూర్తి నగ్నంగా గ్రౌండ్లోకి పరిగెత్తుకు వచ్చాడు. ఆ సమయంలో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. పాక్ ఫీల్డింగ్ చేస్తోంది.
ఈ ఊహించని ఘటనతో స్టేడియం మొత్తం నిర్ఘాంతపోయింది. కొంతసేపటి తర్వాత గ్రౌండ్ స్టాఫ్, సెక్యురిటీ అతన్ని పట్టుకుని బయటికి తీసుకువెళ్లారు. కాగా.. ఆ వ్యక్తి అలా నగ్నంగా పరిగెత్తుకొస్తున్న సమయంలో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ అతన్నే కళ్లప్పగించి చూశాడు. బాబర్ అలా చూస్తున్న విషయంలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాబర్ ఏంటి అతన్ని అలానే చూస్తున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అతన్ని వల్ల మ్యాచ్కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. కాగా.. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇలా నగ్నం ప్రదర్శనలు ఇవ్వడం న్యూజిలాండ్ చాలా సాధరణ విషయమేనంట. కానీ.. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ పాపం.. తొలి సారి చూస్తున్నాడేమో కానీ.. షాక్లో అలానే చూస్తుండిపోయాడు.
ఇక న్యూజిలాండ్ వేదికగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య ట్రైసిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పాక్.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్లను ఓడించా పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది. న్యూజిలాండ్ పాక్పై ఓడి.. బంగ్లాపై గెలిచి రెండో స్థానంలోనూ.. రెండు మ్యాచ్లు ఓడిన బంగ్లాదేశ్ చివరి స్థానంలో ఉంది. కాగా.. ప్రతిష్టత్మక టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు ఈ ట్రైసిరీస్ పాకిస్థాన్తో పాటు బంగ్లాదేశ్కు ఎంతో ఉపయోగపడనుంది. ఎందుకంటే వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగనుండగా.. ఆసీస్ పిచ్లు కివీస్ పిచ్లు దాదాపు ఒకేలా ఉంటాయి. అందుకే మెగా టోర్నీకి ముందు ఈ రెండు జట్లకు అక్కడ మంచి ప్రాక్టీస్ లభిస్తుంది.