కిడ్నీలో రాళ్లు.. మారుతున్న జీవన విధానంతో ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. కిడ్నీలో రాళ్లు వస్తే ఆ బాధ వర్ణించడానికి పదాలు దొరకవు అంటారు. ఆ బాధను భరించడం కంటే సర్జరీ చేయించుకుని తీసేయించుకోవడమే చాలా సులభం అని చెబుతుంటారు. ఇప్పుడు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో కిడ్నీలో స్టోన్స్ ని తీసేయడం చాలా సులభం కూడా అయ్యింది. అందుకే వైద్యులు సైతం సర్జరీనే ఎక్కువ రిఫర్ చేస్తుంటారు. అయితే ఈ వార్త చదివిన తర్వాత కిడ్నీలో రాళ్లకు ఆపరేషన్ చేయించుకోవాలి అనే ఆలోచనను మీరు మార్చుకునే అవకాశం లేకపోలేదు. అవునండి.. ఎందుకు అంత గట్టిగా చెబుతున్నామంటే.. రాళ్లు తీస్తామని చెప్పి ఓ వ్యక్తికి కిడ్నీ తీసేశారు. అయితే ఎక్కడ జరిగింది? ఏం చేశారు అని తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. సురేశ్ చంద్ర అనే వ్యక్తి కస్గంజ్లో నివసిస్తున్నాడు. అతను హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతనికి కిడ్నీలో రాళ్లు ఏర్పడి నొప్పి వస్తుండటంతో ఈ ఏడాది ఏప్రిల్ 12న ఆస్పత్రికి వెళ్లాడు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని.. ఆపరేషన్ చేసి తొలగించాలని చెప్పాడు. ఏప్రిల్ 14న సురేశ్ చంద్ర ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అతనికి సర్జరీ చేశారు. తర్వాత నొప్పి రాలేదు.. అంతా బాగానే ఉంది అనుకున్నాడు. కానీ, 8 నెలల తర్వాత మళ్లీ నెడమ పక్క నొప్పి రావడం మొదలైంది. అందుకని సురేశ్ చంద్ర అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకున్నాడు. ఆ రిపోర్ట్స్ చూసిన సురేశ్ చంద్రకు కాసేపు ఏమీ అర్థం కాలేదు.
అవును ఆ రిపోర్ట్స్ చూసి సురేశ్ షాకయ్యాడు. ఎందుకంటే అతనికి ఎడమ కిడ్నీ లేదని రిపోర్ట్స్ లో వచ్చింది. అతను అప్పుడు రాళ్లు ఉన్నాయని సర్జరీ చేయించుకుంది ఆ కడ్నీకే. అప్పుడే సురేశ్ చంద్రకు మొత్తం అర్థమైంది. అతనికి స్టోన్స్ సర్జరీ చేస్తామని చెప్పి ఏకంగా కిడ్నీనే కోసి తీసేశారు. అసలు విషయం తెలుసుకున్న సురేశ్ చంద్ర లబోదిబో మన్నాడు. అయితే వెంటనే తేరుకుని అసలు విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశాడు. ఇలా తాను కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడ్డానని.. సర్జరీ కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే కిడ్నీనే మాయం చేశారని చెప్పుకొచ్చాడు. మౌకికంగా సురేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉన్నతాధికారులు సైతం చర్యలు తీసుకుంటామని అతనికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగానే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.