మన దేశం మత సామరస్యాలకు పుట్టినిల్లు. ఇక్కడ అన్ని మతాల, కులాల వారు అన్నదమ్ముల వల్లే కలిసి ఉంటారు. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా సాయం చేస్తుంటారు. ఓ మతం వారు జరుపుకునే పండగలకు, వేడుకలకు మరొక మతం వారు వచ్చి సందండి చేస్తుంటారు. మరికొందరు వచ్చి పూజలు, ప్రార్ధనలు జరిపింస్తుంటారు. ఇలా మతసామరస్యానికి నిదర్శనంగా అనేకం జరుగుతున్నాయి. గణపతి వేడుకలకు ముస్లింలు పూజలు చేయడం, ముస్లింల వేడుకలకు హిందువులు వెళ్లి సాయం చేయడం మనం చూస్తుంటాం. ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ ముస్లిం కుటుంబం కోటి రూపాయాలు విరాళంగా ఇచ్చింది. తాజాగా కర్ణాటకలో అమ్మవారికి 8 లక్షల విలువైన బంగారపు చీరను ఓ ముస్లిం కుటుంబం సమర్పించి మత సమ సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కర్ణాటక జిల్లా మతపరంగా సున్నితమైన ప్రాంతంగా భావిస్తారు. తరచూ ఈ జిల్లాలో మత కల్లోలాలు జరుగుతుంటాయని చాలా మంది అభిప్రాయ పడుతుంటారు. అలాంటి వారి అభిప్రాయాలను కొట్టి పారేస్తూ ఇక్కడ కూడ మత సామరస్యం ఉందని చెప్పడానికి మంగుళూరులోని ప్రసిద్ధ శారదా మహోత్సవం చరిత్రే నిదర్శనం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలకు ఈ ఆలయం సిధ్దమైంది. శ్రీ వెంకటరమణ దేవాలయంలో సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 6 వరకు “మంగుళూరు దసరా” ఉత్సవాలు జరగుతోన్నాయి. ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇక్కడి దేవాలయంలోని శారదా దేవి విగ్రహానికి బంగారు ఎంబ్రాయిడరీతో కూడిన ఆకుపచ్చ పట్టు చీరకు ఓ ముస్లిం కుటుంబ రూపొందింస్తోంది. అమ్మవారి చీరకు తుది మెరుగులు అద్దే పనిలో ఈ కుటుంబ నిమగ్నమైంది. 8 లక్షల రూపాయల విలువైన ఈ అందమైన చీరతో అమ్మవారిని అలంకరించనున్నట్లు శారద మహోత్సవ సమితి మీడియా కోఆర్డినేటర్ మంజు నీరేష్వాల్య తెలిపారు.
ఈ శారద దేవి మహోత్సవాలు 1922 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఈ క్రమంలో 1988 నుంచి తమ తల్లి జ్ఞాపకార్ధం ఓ ముస్లిం కుటుంబా అమ్మవారికి చీరను అందచేస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందిన ఐదో తరం నేత కార్మికులు అమ్మవారికి రూ.8లక్షల విలువైన చీరను అందజేశారు. ఈ ముదురు ఆకుపచ్చ రంగు చీరలో దాదాపు 2,600 బంగారు స్టడ్లు ఉన్నాయి. అలాగే, వెండి బంగారు పూతతో కూడిన జరీతో ఎంబ్రాయిడరీ చేయబడింది. గతంలో 60-70 వేల ఖరీదైన చీరలు ఇచ్చే ఈ ముస్లిం కుటుంబ సభ్యులు.. ఈసారి శారదాదేవి అమ్మవారికి రూ.8 లక్షల విలువైన చీరను సిద్ధం చేశారు. నవరాత్రుల ఆరవ రోజున అమ్మవారికి ఈ చీరను అలంకరిస్తారు. ఈ యేడు ఆలయంలో శతాబ్ధి మహోత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని శారదా మహోత్సవ కమిటీ నిర్ణయించింది.మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.