హీరోయిన్ రోజా అంటే ఎవరైనా సరే టక్కున గుర్తుపట్టేస్తారు. ‘జబర్దస్త్’ జడ్జి రోజా అంటే ఇంకా బాగా గుర్తుపట్టేస్తారు. అంతలా ఆమె పాపులర్ అయింది. హీరోయిన్ గా చేసి ఎంత ఫేమ్ తెచ్చుకుందో.. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా చేసి అంతకంటే ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఇక ఏపీ కేబీనెట్ లో మంత్రి అయిన తర్వాత పూర్తిగా సినిమాలు, టీవీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు చాలారోజుల తర్వాత మళ్లీ స్టేజీపైకి రీఎంట్రీ ఇచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ రోజా, ఒకప్పటి స్టార్ హీరోలైన చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ తోపాటు ఇతర హీరోల సినిమాల్లోనూ నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించింది. అలా తమిళ డైరెక్టర్ ఆర్కే సెల్వమణిని పెళ్లి కూడా చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు నటనకు బ్రేక్ ఇచ్చిన రోజా.. రీఎంట్రీలో పలు తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలు చేసి ఆకట్టుకుంది. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా బిగ్ స్క్రీన్ కి దూరమైపోయింది. పలు టీవీ షోల్లో జడ్జిగా చేసింది.
2013 ఫిబ్రవరిలో ‘జబర్దస్త్’ కామెడీ షో మొదలైనప్పుడు నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించారు. అలా కొన్నేళ్లపాటు విజయవంతంగా షో ప్రసారమైంది. 2019లో జడ్జి నాగబాబు.. వ్యక్తిగత కారణాలతో షో నుంచి తప్పుకొంది. రోజా మాత్రం మొన్నమొన్నటి వరకు అటు జబర్దస్త్, ఇటు ఎక్స్ ట్రా జబర్దస్ షోలకు జడ్జిగా కొనసాగింది. ఓవైపు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా సేవలందిస్తూనే, మరోవైపు టీవీ ప్రేక్షకులకు తన నవ్వుతో ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చింది.
ఇక ఈ మధ్య ఏపీ కేబీనేట్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ‘జబర్దస్త్’, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’కు పూర్తిగా దూరమయ్యారు. ఇక సినిమా, టీవీ షోలు చేయనని చెప్పేశారు. దీంతో రోజా ఫ్యాన్స్ చాలామంది బాధపడ్డారు. షోల్లో ఇక ఆమె కనిపించరని ఫిక్సయిపోయారు. కానీ మంత్రి అయిన తర్వాత తొలిసారి దసరా స్పెషల్ ఈవెంట్ లో సందడి చేసేందుకు రెడీ అయిపోయారు. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా రోజాని స్టేజీపై ఘనంగా సన్మానించారు. ఇకపోతే రోజా ఈ ఒక్క ఎపిసోడ్ లో కనిపిస్తుందా? ముందు ముందు జరిగే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా కనిపిస్తుందా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి రోజాకు స్టేజీపై సన్మానం చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: కూతురి పుట్టిన రోజున రోజా పోస్ట్ వైరల్.. కూతురివే కాదంటూ..