బుల్లితెరపై విశేషంగా ఆకట్టుకుంటున్న మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ షోల జాబితాలో జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఉంటుందనే చెప్పాలి. గత ఏడాదిన్నర కాలంగా టీవీ ప్రేక్షకులను వినోదాన్ని అందిస్తున్న ఈ షో.. ప్రతి ఆదివారం ప్రసారమవుతుంది. అయితే.. కామెడీ స్కిట్స్ తో పాటు కొత్త టాలెంట్ ని స్టేజిపై పరిచయం చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో.. వారానికి ఓ కాన్సెప్ట్ లెక్కన ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం ప్రసారమైన ఈ షో ఎపిసోడ్ ని ‘రాను రాను అంటుంది చిన్నదో’ అనే కాన్సెప్ట్ తో నిర్వహించారు. హీరోయిన్ పూర్ణ జడ్జిగా వ్యవహరించిన ఈ ఎపిసోడ్ కి హీరోయిన్ సదా స్పెషల్ గెస్ట్ గా హాజరైంది.
ఇక ఈ షోకి కొన్ని వారాలుగా యాంకర్ రష్మీ హోస్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు నిర్వహించేది ఒకే ఛానల్ కాబట్టి.. జబర్దస్త్ లోని కమెడియన్స్ అంతా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా స్కిట్స్ చేసి ప్రేక్షకులను నవ్విస్తుంటారు. ఈ నేపథ్యంలో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ మొదలుకొని అందరు కమెడియన్స్ కి లేడీ ఆర్టిస్టులను భార్యలుగా ఈ ఎపిసోడ్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ‘రాను రాను అంటుంది చిన్నదో’ అన్న కాన్సెప్ట్ కు తగ్గట్టుగానే భార్యలు భర్తలను వదిలి పుట్టింటికి వెళ్లగా.. వారిని ఇంప్రెస్ చేసి ఎలా ఇంటికి రప్పించుకున్నారు అనేది చూపించారు. అయితే.. భార్యలను ఇంప్రెస్ చేసేందుకు షోలో కమెడియన్స్ అందరికి రింగ్ లో రెజ్లింగ్(కుస్తీ) పోటీలను ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా హైపర్ ఆది, రాంప్రసాద్, ఇమ్మానుయేల్, నూకరాజు, నరేష్, భాస్కర్ ఇలా అందరూ చొక్కాలు లేకుండా షార్ట్స్ పై దర్శనం ఇచ్చారు. వీరిని రింగ్ లో ఆడించేందుకు పంచ్ ప్రసాద్ ఎంపైర్ గా వ్యవహరించాడు. అయితే.. షోలో భార్యలు, భర్తలు అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు.. ఇలా అందరు మగాళ్లు అర్ధ నగ్నంగా కనిపించేసరికి షోలో ఉన్న జడ్జిలు, యాంకర్, లేడీస్ అంతా ఇబ్బందిగా ఫీలయ్యారు. అలాగే మగాళ్ల మధ్యలో యాంకర్ రష్మీ నిలబడి ఇబ్బంది పడుతుండటంపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంటర్టైన్ మెంట్ కోసమే అలా చేసినప్పటికీ, మరీ అలా చొక్కాలు తీసేసి కనిపించే అవసరం లేదు కదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్కిట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి అర్ధ నగ్నంగా ఉన్న కమెడియన్స్ స్కిట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.