దర్శకధీరుడు రాజమౌళికి దేశవ్యాప్తంగా విపరీతైమన క్రేజ్ ఉంది. ఆయన సినిమాలో ఏదో ఓ చిన్న పాత్రలో నటించినా చాలని.. ప్రతి ఒక్కరు ఆశపడతారు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తారు. రాజమౌళి సినిమాలో అవకాశం లభిస్తే.. కొందరు ఆస్కార్ అవార్డు వచ్చినంత గొప్పగా ఫీలవుతారు. ఎట్టి పరిస్థితుల్లోను ఆ అవకాశాన్ని జారవిడుచుకోరు. మిగతా సినిమాలు క్యాన్సిల్ చేసుకుని మరి.. జక్కన్న సినిమాలో యాక్ట్ చేస్తారు. అది రాజమౌళి క్రేజ్. అసలు ఆయన సినిమాకు నో చెప్పేవారు ఉంటారంటేనే ఆశ్చర్యం. కానీ తాను మాత్రం ఆ అవకాశాన్ని వదులుకున్నాని.. అందుకు తనకు ఏ మాత్రం బాధ లేదని.. పైగా చాలా గర్వపడుతున్నాను అంటుంది మంచు లక్ష్మి. అంతేకాక తాను వద్దనుకున్న సినిమా.. బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులు చూసి గర్వపడుతున్నాను అని చెప్పుకొచ్చింది.
బాహుబలి చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్కల పాత్రలకు ఎంతటి ప్రాధాన్యత ఉదో.. రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇక రాజమాత శివగామి పాత్రలో రమ్యకృష్ణ చెలరేగిపోయారు. తన అద్భుతమైన నటనతో శివగామి పాత్రను చరిత్రలో నిలిచిపోయేలా చేశారు. అయితే ఈ పాత్రకు రాజమౌళి తొలుత అనుకున్నది రమ్యకృష్ణను కాదు. ఆమె కన్నా ముందు పలువురిని సంప్రదించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. శివగామి పాత్ర కోసం రాజమౌళి సంప్రదించిన వారిలో మంచు లక్ష్మి కూడా ఉన్నారట. కానీ తాను ఆ పాత్ర చేయనని చెప్పానని.. అందుకు తన వద్ద బలమైన కారణం ఉందన్నారు మంచు లక్ష్మి.
తాజాగా మంచు లక్ష్మి ఓ యూట్యూబ్ చానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘బాహుబలిలో శివగామి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అయితే ప్రభాస్కు తల్లిగా నేను చేయాలనుకోలేదు. ఇండియాలో మనం ఒక పాత్ర పోషించిన తరవాత దానిలోనే ఉండిపోతాం. కానీ నేను మాత్రం ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలనుకోలేదు. బాహుబలి సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక నిజానికి నేను చాలా గర్వపడ్డాను. హమ్మయ్యా.. ఆ సినిమా నేను చేయలేదు అనుకున్నాను. అదొక ప్రత్యేకమైన సినిమా కావచ్చు. కానీ, ఆ పాత్రకు నేను కరెక్ట్ అని అనిపించలేదు. నా లైఫ్, నా కెరీర్ను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నాను. అలానే నేను నా కెరీర్లో చేసిన ఐరేంద్రి లాంటి పాత్ర ఇంకోటి రాలేదు.. ఇక మీదట రాబోదు కూడా’’ అని చెప్పుకొచ్చారు.
డైలాగ్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా.. బాలనటిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. ఆతర్వాత హాలీవుడ్లో రెండు మూడు సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆతర్వాత తెలుగులో ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ఐరేంద్రి అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించారు మంచు లక్ష్మి. శ్రుతి హాసన్, సిద్ధార్థ్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ, ఈ సినిమాలో తాను చేసిన ఐరేంద్రి పాత్ర తన ఆల్టైమ్ ఫేవరేట్ అని చెప్తుంది మంచు లక్ష్మి. అంతేకాక అలాంటి పాత్ర మళ్లీ రాదని, రాబోదని తెలిపింది.
ఇక ఇప్పటి వరకు తన కెరీర్లో తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించిన మంచు లక్ష్మి.. తాజాగా మలయాళ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. మోహన్లాల్ హీరోగా వస్తోన్న ‘మాన్స్టర్’ మూవీలో మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించారు. ఈనెల 21న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై కేరళలో భారీ అంచనాలున్నాయి. మోహన్లాల్ వంటి దిగ్గజ దర్శకుడి సినిమాతో మలయాళ సినీ పరిశ్రమకు పరిచయమవుతున్నందుకు సోషల్ మీడియా వేదిగా ఆనందం వ్యక్తం చేసింది మంచు లక్ష్మి. మరి శివగామి పాత్రలో మంచు లక్ష్మి నటించి ఉంటే.. ఎలా ఉండేదో ఊహించి కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజనులు.