Manchu Lakshmi: స్టార్ కిడ్గా సినిమాల్లోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి మంచు లక్ష్మి. విలన్గా, హీరోయిన్గా, క్యారెక్ట్ ఆర్టిస్ట్గా ఇలా అన్ని రోల్స్తో తన ప్రతిభను చాటారు. నటనలో తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నారు. ఇక, మంచు లక్ష్మి మహిళలకు సంబంధించిన విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటారు. వారి హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. మగాళ్ల అణిచివేతను అస్సలు సహించరు. అవసరం ఉన్నప్పుడు ఎలాంటి భయం లేకుండా గట్టిగా మాట్లాడతారు. గతంలో ఆమె మగాళ్ల గురించి ఓ పాట కూడా పాడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మగాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో.. ‘‘ ఒక నటిగా.. ఓ మహిళగా… ఈ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వటం ఎలా అనిపిస్తోంది. ఇన్నేళ్ల జర్నీ ఎలా అనిపిస్తోంది’’ అని యాంకర్ అడగ్గా.. అందుకు మంచు లక్ష్మి సమాధానం ఇస్తూ.. ‘‘ ఎలా అనిపిస్తుందంటే.. ఒళ్లు మండుతా ఉంటుంది. బయటి నుంచి ఫైట్ చేయటం కంటే లోపలినుంచి ఫైట్ చేయటం మంచిదనిపిస్తుంది. ఇప్పుడు నేను కొత్తగా చేస్తున్నది కాదు.. సమాన హక్కుల కోసం ముందునుంచి చాలా మంది ఫైట్ చేస్తూ వస్తున్నారు.
ఇరాన్లో జరుగుతున్నది. 1970ల వరకు మహిళలు క్రౌన్లు ధరించేవారు. కానీ, గత 30 సంవత్సరాలుగా అకస్మాత్తుగా ఏం జరుగుతోంది. మహిళల్ని తక్కువ చేయటంలో మగాళ్లకు వచ్చే ఆనందం ఏంటో నాకు అర్థం కాదు. నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. నేను మాట్లాడటం మానేయను. నేను నా హక్కుల కోసం నిలబడతాను. నా హక్కుల కోసం పోరాడతాను. నా భుజాల్ని గట్టిగా చేస్తాను. నా తర్వాత వచ్చే వాళ్లకు నా భుజాల మీద చోటిచ్చి వారిని ఎత్తులో నిలబెడతాను. నేను అబ్బాయిల మీద చాలా జెంటిల్గా ఆ పాట పాడాను. ఒరిజినల్ ఆలోచనల్ని పాడుంటే చెవులు మూసుకునేవారు’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి: Anshitha: నటులు అర్నవ్-దివ్యల వివాదం.. నటి అన్షిత ఆడియో లీక్