ప్రస్తుతం సమాజంలో క్షణికావేశంలో చేసే నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతీకారం తీర్చుకోవడం, పరువుహత్యలు వంటివి ఎక్కువ అవుతున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్ను చంపాడనే కోపంతో.. ఆమె సోదరుడు.. బావ(అక్క భర్త)ను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
మండ్య జిల్లా మద్దూరుకు చెందిన యువ నటుడు సతీష్ వజ్ర (36) శుక్రవారం రాత్రి బెంగళూరులో హత్యకు గురయ్యాడు. మూడు నెలల క్రితమే ఆయన భార్య ఆత్మహత్య చేసుకొంది. బెంగళూరులోనే నివాసం ఉంటూ టీవీ, యూట్యూబ్ చానెళ్లలో నటించి పేరు పొందిన సతీష్ ఇటీవల లగోరి అనే చిన్న సినిమాలోనూ నటించాడు.
ఇది కూడా చదవండి: Mens Monday: స్టార్ హీరోయిన్ పోస్టర్ తో రెస్టారెంట్.. పురుషులకు మాత్రమే 25% ప్రత్యేక డిస్కౌంట్!
ఈ క్రమంలో కొందరు దుండుగులు శుక్రవారం సతీష్ ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేసి చంపారు. అక్క అకాల మరణానికి ప్రతీకారంగా భార్య తమ్ముడే ఈ హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. రాజరాజేశ్వరినగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: NTR: ఇజ్రాయెల్ లో RRR హవా.. భీం పాత్రలో ఎన్టీఆర్ ని కొనియాడుతూ ప్రత్యేక కథనం!