మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఏడాది మరో సినిమాతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమైపోయారు. ఆయన హీరోగా చేసిన ‘గాడ్ ఫాదర్’, అక్టోబరు 5న దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా గత కొన్నిరోజుల నుంచి ప్రచారంలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రం.. మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ అయినప్పటికీ ప్రేక్షకుల్ని చాలా ఎంటర్ టైన్ చేస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇక మిగతా టీమ్ అంతా కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ క్రమంలోనే చిరు, సినిమాలో నటించిన అనసూయ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. చిరు ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో ఈ మధ్య నిర్వహించారు. ఆరోజు అకస్మాత్తుగా వర్షం పడటంతో చిరు సింపుల్ స్పీచ్ తో ముగించేశారు. అంతటి వర్షంలో కూడా చిరంజీవి స్పీచ్ కోసం ఆడియెన్స్ వర్షంలో తడుస్తూనే ఉన్నారు. వర్షం కారణంగా కంగారుగా వేడుక పూర్తి చేయడం కోసం చిరు.. వేదికపై కొందరు ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు పేర్లు మాత్రమే ప్రస్తావించారు. కొందరి పేర్లు మర్చిపోయారు. అలాంటి వారిలో అనసూయ ఒకరు. ఈమె కూడా సినిమాలో ఓ పాత్రలో నటించినంది.
ఆ వేడుక పూర్తయిన తర్వాత ఈ మధ్య చిరంజీవిని అనసూయ కలిసింది. ఆ సందర్భంలో.. ‘సార్ అనంతపురం వేడుకలో నా గురించి చెప్పడం మర్చిపోయారు’ అని చిరుని ఆమె అడిగేసింది. బుంగమూతి కూడా పెట్టిందట! ఆ విషయాన్ని మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో చిరంజీవి బయటపెట్టారు. ఆ తర్వాత అందరికీ ఫోన్ చేసి సారీ చెప్పానని అన్నారు. అదే వేదికపై ‘గాడ్ ఫాదర్’ కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు గురించి మాట్లాడారు. ఇక ఈ సినిమాలో చిరుతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. మరి చిరుపై అనసూయ అలక గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.