తెలుగులో బ్యూటీఫుల్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. బుల్లితెర మీద యాంకర్గా చేస్తూనే.. సినిమాల్లో కూడా నటించింది. ఈ క్రమంలో రంగస్థలం, క్షణం సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు దొరికింది. మరీ ముఖ్యంగా రంగమ్మత్త క్యారెక్టర్ ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత వరుస సినిమాలు చూస్తూ బిజీగా మారింది. తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో ‘దర్జా’ అనే సినిమా వచ్చింది. అలానే ఇటీవల విడుదలైన ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉంటుందో ఎంత బిజీగా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్గా ఉంటుంది అనసూయ. పలు అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంది. దాంతో పలు వివాదాల్లో చిక్కుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా లైగర్ సినిమా విడుదల సందర్భంగా అనసూయ ఆంటీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
లైగర్ సినిమా ఫలితాన్ని ఉద్దేశిస్తూ.. పరోక్షంగా అనసూయ చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసింది. విజయ్ దేవరకొండను కర్మఫలం వెంటాడిందని.. అందుకే లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యింది అని అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది అనసూయ. దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమెను ఓ రేంజ్లో ట్రోల్ చేయడం ప్రాంరభించారు. దానిలో భాగంగానే ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో తనను ఆంటీ అన్న వారిపై కేసు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ వివాదంపై నటుడు బ్రహ్మాజీ సైతం ఇండైరెక్ట్గా సెటైర్స్ వేశాడు. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది.
ఈ క్రమంలో తాజాగా అనసూయ.. యాంకర్ సుమ నిర్వహించే ‘క్రేజీ కిచన్’ అనే వంటల కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ సందర్భంగా అనసూయ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. చాలా మంది తనకు వంటలు రావని అనుకుంటారని.. కానీ, తాను చాలా బాగా వంట చేస్తానని చెప్పుకొచ్చింది రంగమ్మత్త. తాను ఎంత బాగా వండుతానో.. ఈ షో ద్వారా అందరికి తెలుస్తుంది అన్నది. ఇక మాటల సందర్భంలో ఆంటీ విషయం ప్రస్తావనకు వచ్చింది.
ఈ సందర్భంగా అనసూయ స్పందిస్తూ.. ‘‘నిజంగా చెప్పాలంటే.. అత్తా, పిత్తా అని పిలవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. చివరికి నా కోడలైన సరే.. నన్ను అత్త అని పిలిస్తే ఇష్టపడను. జస్ట్ అను అని పిలిస్తే చాలు” అని చెప్పింది. దాంతో మరోసారి ఆంటీ వివాదం తెరమీదకు వచ్చింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.