పొరుగింటి పుల్ల కూర రుచి అన్న సామెత ఊరికే రాలేదు. కొంతమందికి ఇంట్లో భార్య కంటే కూడా పొరుగింటి మహిళల మీదే మోజు ఎక్కువ ఉంటుంది. ఆ మోజుని కడుపులో గ్యాస్ ని దాచుకున్నట్టు దాచుకుంటే పర్లేదు. గ్యాస్ లీక్ అయినప్పుడే చాలా దారుణాలు జరిగిపోతాయి. ఆ వివాహేతర సంబంధం తాలూకు స్మెల్ కనిపెడితే ఇక అంతే సంగతులు. ఆ భర్తకి భార్య చేతిలో చాకిరేవే. తాజాగా ఓ మహిళ తన భర్తను, ప్రియురాలిని ఇద్దరినీ ఉతికారేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాకు చెందిన ఓ జంటకు స్వీట్ 16 ఇయర్స్ బ్యాక్ పెళ్లయ్యింది. వీరి వివాహ బంధానికి ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే బుద్ధిగా పెళ్ళాం, పిల్లలతో హాయిగా ఉండడం మానేసి.. పరాయి స్త్రీ వ్యామోహంలో పచ్చని సంసారంలో నిప్పులు పోసుకున్నాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం తెలిసిన భార్య తరపు బంధువులు ఆమెకు భర్త గురించి చెప్పారు. దీంతో ఆమె ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా భర్తను హెచ్చరించింది. అయినా కూడా భర్తలో ఎటువంటి మార్పూ రాలేదు. మార్పు రాకపోగా ఏకంగా హోటల్ రూమ్ లోనే ప్రియురాలితో దుకాణం పెట్టేశాడు. ఈ విషయం బంధువుల ద్వారా తెలుసుకున్న అతని భార్య నేరుగా హోటల్ రూమ్ కి వెళ్ళింది. పక్క సమాచారంతో పోలీసులా హోటల్ రూమ్ లోకి వెళ్లి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అక్కడితో ఆగకుండా ఎన్ని సార్లు చెప్పాలిరా అంటూ భర్తని, ప్రియురాలిని ఇద్దరినీ చెప్పుతో చెడామడా కొట్టింది. ఈ విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ ఘటనపై భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. మరి భర్తని, ప్రియురాలిని ఉతికారేసిన ఈ మహిళపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
होटल के कमरे में दूसरी महिला संग पकड़ा गया पति, देखते ही पत्नी ने चप्पल से पीटा#UttarPradeshNews #agra #Videos #ViralVideo #reelsvideo #trendingvideos pic.twitter.com/eKdrxRSvEH
— News Track (@newstracklive) September 20, 2022