Crime News: ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోవటం, ప్రాణాలు తీసుకోవటం ఎక్కువయిపోయింది. కొందరు క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ తండ్రి మాంసం విషయంలో చోటుచేసుకున్న గొడవలో కూతుర్ని కాల్చి చంపాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని తుల్జాపూర్ తాలూకా, కార్లాకు చెందిన కాజల్ షిండేకు అదే ప్రాంతానికి చెందిన మనోజ్ సునీల్ షిండేకు కొన్ని నెలల క్రితం పెళ్లయింది. కాజల్ తాజాగా, భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఆదివారం తల్లిదండ్రులకోసం అద్భుతంగా మటన్ కూర వండింది. మటన్ వండిన తర్వాత ఇంట్లో వేరే పనులు ఉంటే వాటిని చేసుకుంటూ ఉండింది.
ఈ నేపథ్యంలో విశ్వాసం లేని ఓ కుక్క ఇంట్లోకి చొరబడింది. చప్పుడు చేయకుండా వంటింట్లోకి వెళ్లింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాంసం పాత్రలోని మాంసాన్నంతా తినేసింది. తర్వాత చల్లగా అక్కడినుంచి జారుకుంది. అయితే, పాత్రలో మాంసం లేకపోవటం, కుక్క ఇంట్లోంచి బయటకు పోవటం గుర్తించిన కాజల్ తల్లి.. దీనిపై కూతుర్ని నిలదీసింది. మాంసం కూరను జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం లేదా అంటూ తిట్టింది. కొద్ది సేపటికి ఆ గొడవ కాస్తా పెద్దదయింది. ఈ నేపథ్యంలో కాజల్ తండ్రి గణేష్ బోష్లే గొడవలో కలుగ జేసుకున్నాడు. గొడవ మరింత పెద్దదయింది. కూతురు మాటకు మాట సమాధానం ఇస్తూ ఉండటంతో గణేష్ ఆగ్రహంతో ఊగిపోయాడు. పైగా తాగిన మత్తులో ఉన్న అతడికి కూతురు శత్రువులాగా కనిపించింది.
వెంటనే ఆమెపై పగ తీర్చు కోవాలన్న కసిపెరిగింది. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా గోడకు తగిలించిన తుపాకిని చేతుల్లోకి తీసుకున్నాడు. దాన్ని కూతురికి గురిపెట్టాడు. ఆమె గుండెలపై తుపాకితో కాల్చాడు. దీంతో ఆమె నేల కొరికింది. రక్తం మడుగుల్లో ప్రాణాల కోసం గిలగిల్లాడింది. ఇంట్లో ఉన్న మిగిలిన వారు కాజల్ను హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. పోలీసులు కాజల్ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న గణేష్ కోసం అన్వేషిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : గర్భవతి అని 9 నెలలు ట్రీట్మెంట్! తీరా కడుపులోనే మాయమైన బిడ్డ!