అనుమానం.. ఈ ఒక్క పదమే సంతోషంగా సాగుతున్న కాపురాన్ని ఎటు కాకుండా చేస్తుంది. దీని కారణంగా ఇప్పటకీ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడడంతో పాటు అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుని జీవితాలను నాశనం చేసుకున్నారు. అయితే ఇదే అనుమానంతో ఓ భర్త భార్యను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో భర్త అనుమానంతో వేధించడంతో భార్య భర్త వేధింపులను భరించలేని కాపురానికి నో అని పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిని జీర్ణించుకోలేకపోయిన తాళికట్టిన భర్త ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఇదే వార్త నంద్యాల జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని లింగం దిన్నె గ్రామం. ఇక్కడే బండి విజయ్ కుమార్, మౌనిక దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత 17 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఓ కూతురు, కొడుకు జన్మించారు. పుట్టిన పిల్లలతో ఆ దంపతుల సంసారం సంతోషంగా సాగుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే భర్త భార్య మౌనికను అనుమానంతో వేధించడం మొదలు పెట్టాడు.
కొన్నాళ్ల పాటు భార్య భర్త వేధింపులను భరిస్తూ వచ్చింది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది భర్త అనుమానం మరింత ఎక్కైంది. ఇక భర్త పోరును భార్య తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే మౌనికకు ఏం చేయాలో అర్థం కాలేదు. చేసేదేం లేక భర్త, పిల్లలను వదిలి మౌనిక తన పుట్టింటికి వెళ్లిపోయింది. అలా కొన్నాళ్ల పాటు భార్య పుట్టింట్లోనే ఉంటుంది. అయితే తన భార్య మళ్లీ కాపురానికి తిరిగొస్తుందని భర్త ఎంతో ఆశతో ఎదురు చూశాడు. కానీ భార్య మాత్రం కాపురానికి నో అని చెప్పింది. భార్య అలా చెప్పడంతో భర్త తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే భర్త ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
తన ఇద్దరి పిల్లలతో కలిసి భర్త.. ఇదే మా చివరి సెల్ఫీ అంటూ పోస్ట్ పెట్టి అప్పటి నుంచి కనిపించకుండాపోయారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్ కుమార్ ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రెస్ చేయగా.. వాళ్లు కడపలో ఉన్నట్లు గుర్తించినా.. ఇప్పటికీ ఇంకా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ప్రస్తుతం పోలీసులు వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే వీరి ఆచూకి ఎవరికైనా కనిపిస్తే 9121101164, 9121101203 నెంబర్లకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. ఉన్నట్టుండి విజయ్ కుమార్, పిల్లలు కనిపించకుండాపోవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.