కేరళలో వెంగరలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ స్కూల్ లో లేడీ టీచర్ గా పని చేస్తున్న ఉపాధ్యాయురాలు ఉన్నట్టుండి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా మృతురాలి డైరీలో సహచర ఉపాధ్యాయుడి పేరు ఉండడంతో అంతా షాక్ కు గురవుతున్నారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఉపాధ్యాయురాలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఆమె డైరీలో అతని పేరు ఎందుకు ఉందనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.
కేరళలోని వెంగర పరిధిలోని ఉన్న మోడల్ సెంకండరీ హయ్యర్ స్కూల్ లో 46 ఏళ్ల బైజు అనే మహిళ టీచర్ గా పని చేస్తుంది. అయితే అదే పాఠశాలలో రాందాస్ అనే వ్యక్తి పాఠశాల ఇంఛార్జ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఒకే స్కూలు కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. అలా కొంత కాలం పాటు బైజు ప్రతీ రోజూ స్కూలుకు వస్తూ పోతూ ఉండేది. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏం తెలియదు కానీ.., ఈ నెల 17న కన్నమంగళంలోని ఎడకాపరంలో ఉపాధ్యాయురాలు బైజు ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. భర్తకు ఏం చేయాలో అర్థం కాక వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక పోలీసులు ఇంట్లో అన్ని పరిశీలిస్తుండగా మృతురాలి బైజు డైరీ దొరికింది. ఆ డైరీలో సహచర ఉపాధ్యాయుడైన రాందాస్ పేరు ఉండడంతో పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
అనంతరం పోలీసులు రాందాస్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే రాందాస్ ఆత్మహత్యకు ప్రేరేపించాడని, దీని కారణంగా బైజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై రాందాస్ ను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.