ఈ రోజుల్లో పెళ్లైన చాలా మంది వ్యక్తులు సొంత కాపురాన్నికాదని వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకున్న ఓ జంట చివరికి మాంత్రికుడి చేతిలో ప్రాణాలతో లేకుండా పోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్ భదవిగూడలోని భావ్జీ మందిర్ లో భలేష్ కుమార్ అనే వ్యక్తి తాంత్రికుడిగా పేరు పొందాడు. ప్రజలను నమ్మించి ఏదో చేస్తానని అందిన కాడికి దోచుకుంటున్నాడు. అలా చుట్టు పక్కల గ్రామాల్లోని జనాలంతా ఎలాంటి ఆపద వచ్చినా ఆ తాంత్రికుడి వద్దకు వెళ్తుంటారు. దీంతో ఆ తాంత్రికుడు అందర్నీ నమ్మించి ఏవేవో తాయత్తులు ఇస్తుండేవాడు. ఇదిలా ఉంటే ఇదే గ్రామానికి చెందిన రాహుల్, సోనూ ఇద్దరివి వేరు వేరు కుటుంబాలు. వీరిద్దరికీ పెళ్లిళ్లు జరిగిపోయాయి. కాగా ఇరు కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా తాంత్రికుడు భలేష్ కుమార్ వద్దకు వెళ్తుండేవారు.
అలా వచ్చిపోతున్న క్రమంలోనే రాహుల్ కు సోనూఅనే మహిళ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. దీంతో ఇద్దరూ ఎంచక్కా సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అయితే వీరిద్దరి ప్రేమాయణం గురించి తాంత్రికుడు భలేష్ కుమార్ రాహుల్ భార్యకు చేర వేశాడు. దీంతో రాహుల్ భార్య భర్త రాహుల్ ను నిలదీయడంతో నోట్లో నీళ్లు నమిలాడు. అలా కొన్ని రోజుల తర్వాతకి రాహుల్ తన వ్యవహారం తన భార్యకు తెలిపింది తాంత్రికుడు భలేష్ కుమార్ అని తెలుసుకున్నాడు. ఇక కోపంతో ఊగిపోయిన రాహుల్ తాంత్రికుడు భలేష్ కుమార్ కు వార్నింగ్ ఇచ్చాడు.
దీంతో భలేష్ కుమార్ రాహుల్ ఇంకేమైనా చేస్తే ఇన్నాళ్లు తెచ్చుకున్న పేరు ప్రతిష్ఠలు మంట కలిసిపోతాయని భయపడ్డాడు. అయితే అలా జరగకుండా ఉండాలంటే ఎలాగైన రాహుల్ ను హత్య చేయాలని తాంత్రికుడు అనుకున్నాడు. ఇక ఇందులో భాగంగానే తాంత్రికుడు రాహుల్, సోనూ ఇద్దర్నీ నమ్మించి ఓ ఇటీవల అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్నాక.. ఒంటిపై బట్టలు లేకుండా రాహుల్, సోనూ ఇద్దర్నీ నా ముందు శృంగారం చేయాలని తాంత్రికుడు బెదిరించాడు. దీంతో రాహుల్, సోనూ మాంత్రికుడు చెప్పినట్లుగానే అతని ముందు శృంగారం చేశారు. ఆ లవర్స్ శృంగారం చేస్తున్న క్రమంలో వారిపై తాంత్రికుడు ఫెవికిక్ పోశాడు.
అలా కొంత సమయానికి వారిద్దరి శరీరాలు గట్టిగా అతుక్కునిపోయాయి. దీంతో వెంటనే ఆ తాంత్రికుడు వారిద్దరినీ దారుణంగా హతమార్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా కొన్ని రోజుల తర్వాత అడవిలో నగ్నంగా శవాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా.., దర్యాప్తులో భాగంగా తాంత్రికుడైన భలేష్ కుమార్ వారిని హత్య చేసినట్లుగా పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు వెంటనే తాంత్రికుడిని ప్రశ్నించగా.., వారిద్దర్నీ నేను చంపానంటూ ఒప్పుకున్నాడు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు భలేష్ కుమార్ అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.