ఆమెకు పెళ్లైంది. భర్తతో వైవాహిక జీవితాన్ని సాఫీగా సాగిస్తూ సంతోషకరమైన కాపురాన్ని సాగిస్తుంది. అంతా బాగుంది అని అనుకుంటున్న తరుణంలోనే ఆ మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. దీంతో ఆ మహిళ పట్టించుకోనట్టుగానే నడుచుకుంది. కానీ.., దీనినే ఆసరాగా తీసుకున్న ఆ యువకుడు ఆ మహిళకు బతికుండగానే నరకం చూపించాడు. దీనిని భరించలేని ఆ మహిళ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
అది మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామం. ఇక్కడే ఈగం రోజా (36) అనే వివాహిత నివాసం ఉంటుంది. అయితే భర్తతో ఆ మహిళ సంతోషంగా కాపురాన్ని సాగిస్తూ వచ్చింది. అలా ఎంతో ఆనందంగా సాగుతున్న తరుణంలోనే నాలుగు నెలల కిందట అదే గ్రామానికి చెందిన సెట్టి రమేష్ అనే యువకుడు ఆ మహిళ జీవితంలోకి వచ్చాడు. మన ఊరు మనిషే కదా అని ఆ మహిళ కొన్ని రోజులు అతనితో మాట్లాడింది. కానీ ఆ యువకుడు మాత్రం ఆ మహిళపై కోరిక పెంచుకుని ఏదేదో చేయాలనుకున్నాడు.
ఇక ఇందులో భాగంగానే ఆ మహిళ ఫోన్ నెంబర్ తీసుకుని తరుచు ఫోన్ చేస్తూ వేధిస్తుండేవాడు. ఇక ఇదే కాకుండా తరుచు ఆ మహిళను ఫోన్ చేస్తూ నాతో మాట్లాడాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఆ యువకుడి టార్చర్ ను భరించలేని ఆ మహిళ కొన్నిరోజుల పాటు ఆ యువకుడి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు తరుచు ఆ మహిళ ఇంటికెళ్లి వేధిస్తుండేవాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ మహిళ ఆ యువకుడి నరకాన్ని తట్టుకోలేక మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
విషయం తెలుసుకున్న ఆ మహిళ కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక ఫలితం లేకపోవడంతో రోజా మంగళవారం ఆస్పత్రిలోనే చికత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కూతురు మరణించడంతో రోజా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.