తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. తాను పని చేసిన బ్యాంకులోనే డబ్బు కాజేశాడు. అన్నం పెట్టిన సంస్థకే ద్రోహం చేయాలని చూశాడు. దీని కోసం ఏడాది పాటు స్కెచ్ వేశాడు. బ్యాంకులో ఉన్న లోపాలు ఏంటి అని తెలుసుకుని, ఫైనల్ గా ప్లాన్ అమలు చేసి డబ్బు కాజేశాడు. ఏసీ గదిలోంచి లాకర్లలో ఉన్న డబ్బుని బయట చెత్తకుప్పలో పడేలా ప్లాన్ చేశాడు. అలా ఏకంగా 12 కోట్లు పైనే కాజేశాడు. సోదరి, మరియు మరి కొంతమంది గ్యాంగ్ తో కలిసి ఈ రాబరీ చేశాడు. ఆ డబ్బుతో జీవితాంతం జల్సాలు చేద్దామని అనుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు.. చోరీ చేసిన మూడు నెలల లోపే బాబుని పోలీసులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పూణేకు చెందిన అల్తాఫ్ షేక్(43).. మహారాష్ట్రలోని థానే జిల్లా మన్పాడ ప్రాంతంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో కస్టోడియన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. కస్టోడియన్ గా బ్యాంకు లాకర్ తాళాలకి సంబంధించి కేర్ టేకర్ గా ఉంటున్నాడు. ముంబ్రాలో నివసించే.. ఐసీఐసీఐ బ్యాంకులో పని చేస్తున్న షేక్.. ఏడాది పాటు లాకర్లలో ఉన్న డబ్బుని ఎలా దొంగిలించాలా అని బాగా స్టడీ చేసి ఒక స్కెచ్ వేశాడు. సిస్టమ్ లో ఉన్న లూప్ హొల్స్ తెలుసుకుని, దొంగతనానికి కావాల్సిన పనిముట్లు అన్నీ సమకూర్చుకుని ఈ భారీ రాబరీకి పాల్పడ్డాడు. లాకర్ రూమ్ లో ఉన్న ఏసీ డక్ట్ నుంచి డబ్బుని పంపించి.. బయట ఉండే చెత్తకుప్పలో పడేలా ప్లాన్ చేశాడు. ఆ డబ్బుని అంతకు ముందే అక్కడికి చేరుకున్న అల్తాఫ్ గ్యాంగ్ తీసుకుంటుంది.
అలా 12 కోట్ల 20 లక్షల రూపాయల సొమ్ముని ఏసీ డక్ట్ నుంచి తరలిస్తూ దొంగిలించారు. ఈ క్రమంలో దొరక్కుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాలను టాంపర్ చేశాడు. ఆ తర్వాత సెక్యూరిటీ అలార్మ్ సిస్టమ్ లను డియాక్టివేట్ చేసి.. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి ఆ డబ్బుని ఏసీ డక్ట్ గుండా తరలించేవాడు. ఎప్పుడైతే బ్యాంకు సిబ్బంది లాకర్లలో డబ్బు మిస్ అయ్యిందని గుర్తించారో.. అప్పుడే అల్తాఫ్ అక్కడి నుండి జారుకున్నాడు. తనని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు బుర్ఖా ధరించి.. రకరకాల వేషాలు మారుస్తూ తిరిగేవాడు. ఎట్టకేలకు రెండున్నర నెలల వేట తర్వాత పూణేలోని సోమవారం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇతనితో పాటు రాబరీకి సహకరించిన అల్తాఫ్ సోదరి నీలోఫర్ మరియు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 9 కోట్లు రికవరీ చేశామని, మిగతా సొమ్ముని కూడా త్వరలోనే రికవరీ చేస్తామని పోలీసులు తెలిపారు. జూలై 12న దొంగతనం జరిగింది. కాగా థానే మరియు ముంబై పోలీసులు జాయింట్ ఆపరేషన్ జరిపి ఈ కేసుని సాల్వ్ చేశారు. మిగతా ముగ్గురు నిందితులను అబ్రార్ ఖురేషి(33), అహ్మద్ ఖాన్(33), అనుజ్ గిరి(30)లుగా పోలీసులు గుర్తించారు. ఈ రాబరీలో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని, విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
Police have arrested the main accused involved in the ₹ 12 crore cash theft from ICICI Bank in Thane’s Manpada area from #Pune after more than two-and-a-half monthshttps://t.co/dsCUQ1ZsSO
— India Ahead News (@IndiaAheadNews) October 6, 2022