Crime News: మహిళలు, యువతులపై రాళ్లు విసిరిన పోకిరీలకు పోలీసులు తగిన విధంగా బుద్ధి చెప్పారు. నిందితులను స్తంభం దగ్గర నిలబెట్టి బ్యాక్లు బద్ధలు కొట్టారు. ఈ సంఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్, ఖేడా జిల్లాలో నవరాత్రుల సందర్భంగా కొందరు మహిళలు, యువతులు, బాలికలు ఒక్కచోట చేరి గార్బా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 150 మంది పోకిరీలు అక్కడికి చేరుకున్నారు. గార్బా ఆడుతున్న ఆడవారిపై రాళ్లు వేయటం మొదలుపెట్టారు. దీంతో కొంతమంది ఆడవాళ్లకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు 43 మందిపై కేసు నమోదు చేశారు. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారికి పోలీసులు తమదైన శైలిలో బుద్ధి చెప్పారు. ఒక్కొక్కరిని అక్కడున్న స్తంభం దగ్గర నిలబెట్టి బ్యాక్పై కర్రతో వాయించారు. ఆ వీడియోలో.. కొంతమంది యూనీఫాంలో లేని పోలీసులు నిలబడి ఉన్నారు. ఓ పోలీస్ కర్రను చేతితో ఎత్తి పట్టుకుని ఉన్నాడు. అతడి ముందు ఓ యువకుడు వెనకాలకు తిరిగి ఉన్నాడు. అతడి రెండు చేతులు స్తంభాన్ని పట్టుకుని ఉన్నాయి. అతడి రెండు చేతుల్ని ముందునుంచి మరో ఇద్దరు పోలీసులు గట్టిగా పట్టుకుని ఉన్నారు.
కర్రతో ఉన్న పోలీసు యువకుడి బ్యాక్పై దెబ్బలు వేయటం మొదలు పెట్టాడు. అలా ఆరు దెబ్బలు బలంగా కొట్టాడు. అనంతరం అక్కడినుంచి నిందితుడ్ని వెళ్లిపోమన్నాడు. ఆ తర్వాత ఇంకో పోలీస్ అతడ్ని ఆపాడు. గుంజీలు తీసి వెళ్లమన్నాడు. నిందితుడు అలానే చేశాడు. ఆ సమయంలో ఓ పోలీస్ కర్రతో అతడ్ని కొట్టాడు. ఇక, ఆ యువకుడు దెబ్బ తిన్న వెంటనే పైకి లేచి అక్కడినుంచి బస్ దగ్గరకు వెళ్లిపోయాడు. అనంతరం పోలీసులు నిందితులను స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
#Gujarat Police taking action on a group of men for pelting stones on women & girls playing Garba.
Now waiting for @RanaAyyub to write a sob story in @washingtonpost about how minorities are being targeted in India.
Don’t be surprised if she demands the right to pelt stones!!! pic.twitter.com/nSCYCA0qbp
— Priti Gandhi – प्रीति गांधी (@MrsGandhi) October 4, 2022