వారిద్దరికి ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఇద్దరూ చూటముచ్చటగా ఉంటారు. ఆ జంటను చూసిన వారు ఎవరైనా సరే.. మేడ్ ఫర్ ఇచ్ అదర్ అంటారు. రెండున్నరేళ్ల క్రితం వారికి ఓ కుమార్తె జన్మించింది. అయితే పుట్టిన బిడ్డ నల్లగా ఉందని.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దాంతో వారిద్దరి మధ్య.. నిత్యం గొడవలు ముదిరాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో దంపతుల మధ్య మరోసారి గొడవలు వచ్చాయి. దాంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం నాలుగు నెలల క్రితం అత్తింటి వారు ఆమెకు సర్ది చెప్పి.. తిరిగి తీసుకువచ్చారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.. ఈ క్రమంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. జరిగిన దారుణ గురించి రెండున్నరేళ్ల కుమార్తె.. తన తాతకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఈ సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా, ఉమ్మర్కోట్ సమితి సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్ ఘోష్కు కారాగావ్ గ్రామానికి చెందిన లిపికా మండల్తో వివాహం అయ్యింది. పెళ్లి తర్వాత.. వారిద్దరూ ఉపాధికోసం ఏపీలోని కాకినాకు వలస వెళ్లారు. ఈ క్రమంలో రెండున్నరేళ్ల కిందట వారికి మహి అనే కుమార్తె జన్మించింది. అయితే చిన్నారి నల్లగా ఉండటంతో.. లిపికాపై ఆమె భర్త మాణిక్ అనుమానం పెంచుకున్నాడు. దీనిపై వారిద్దరి మధ్య పలుమార్లు.. గొడవలయ్యాయి. ఈ క్రమంలో ఈ ఏడాది మొదట్లో.. లిపికా, మాణిక్ల మధ్య గొడవ జరిగింది. దాంతో లిపికా పుట్టింటికి వెళ్లింది.
ఈ క్రమంలో జూన్లో అత్తింటి వారు లిపికాకు నచ్చచెప్పి.. కాకినాడకు పంపించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 18న రాత్రి లిపికాకు మూర్ఛ వచ్చిందని.. స్నేహితుల సాయంతో.. అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే లిపికా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఆమె మెడ మీద కమిలిన గుర్తులుండటంతో.. అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈలోపు పోస్ట్మార్టం నిర్వహించి.. దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఇక లిపికా తల్లిదండ్రులు.. మంగళవారం కాకినాడ వెళ్లి చిన్నారిని తమతో కారగావ్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో మాటల సందర్భంలో మహి తన తాతతో తండ్రి, తల్లిని ఎలా చంపాడో వివరించింది. నాన్న అమ్మ గొంతు పట్టకుని.. వదల్లేదు.. అమ్మ కాళ్లు గిలగిల కొట్టుకుంటూ మృతి చెందింది అంటూ వచ్చిరాని మాటలతో.. గొంతుపై చేతులుంచుకుని చూపించింది.
అప్పటి వరకు మూర్ఛ వ్యాధి కారణంగానే తన బిడ్డ మృతి చెందింది అని భావించిన లిపికా తండ్రి.. అల్లుడు చేసిన పని వల్లే తమ కుమార్తె మరణించిందని గ్రహించాడు. వెంటనే మనవరాలిని తీసుకుని.. ఉమ్మర్కోట్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అక్కడ మహి.. మరోసారి జరిగిన విషయాన్ని పోలీసులకూ తెలిపింది. ఈ క్రమంలో కాకినాడ పోలీసులు మాణిక్ను అరెస్ట్ చేశారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.