భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. ఉదయం తిట్టుకుని సాయంత్రానికి మాట్లాడుకునే భార్యాభర్తలు లేకపోలేదు. ఇంకొందరు భార్యాభర్తలు మాత్రం క్షణికావేశంలో హత్యలు లేదా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అయితే ఓ భార్యాభర్తలకు ఓ చిన్న గొడవ జరిగింది. ఇదే కోపంలో భర్త.. చచ్చిపోతున్నానని భార్యను బయపెట్టాలనుకున్నాడు. కానీ చివరికి ప్రమాదవశాత్తులో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ముంబాయిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబాయిలోని విరార్ వెస్ట్ వీర్ సవార్కర్ లో శర్మ, చాందినిదేవి అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. పెళ్లైన నాటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉంటున్నారు. ఇటీవల ఈ దంపతులిద్దరూ షాపింగ్ కు వెళ్లారు. షాపింగ్ ముగిసిన తర్వాత మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ భర్త భార్యతో గొడవ పడ్డాడు. ఇదే గొడవ చినిగి చినిగి గాలి వానలా తయారైంది. ఈ క్రమంలోనే భర్త భార్యను బయపెట్టానుకున్నాడు. దీంతో ఇంట్లో ఫ్యానుకు ఉరిసుకుని చచ్చిపోతున్నానంటూ భార్యకు చెప్పాడు.
ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తులో తాను వేసుకున్న ఉరికి వేలాడుతూ భర్త కొట్టుమిట్టాడాడు. దీనిని గమనించిన భార్య భార్య వెంటనే అతనిని కిందకుదించి ఆస్పత్రికి తరించింది. ఇక చికిత్స పొందుతూ శర్మ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. చనిపోతున్నానంటూ భార్యను బయపెట్టాలనుకుని చివరికి ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.