ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. వీరి పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఎదురించి మరీ లవ్ మ్యారేజ్ లు చేసుకుంటున్నారు. ఇక చేసుకున్నాక సంతోషంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. భార్యాభర్యలుజ.., వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు నేపథ్యంలో జరిగే గొడవలకు చివరికి దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే జరిగిన ఓ ఘటనలో భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం అరకభద్ర. ఇదే గ్రామంలో నర్సింహ బెహర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే ఇదే గ్రామానికి చెందిన భవాని అనే యువతిని నర్సింహ బెహర ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. దీంతో కొన్నాళ్ల తర్వాత భవాని కూడా అతని ప్రేమలో పడింది. ఇక ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించి గత కొన్నేళ్ల కిందట తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు స్థానికంగా ఓ గుడిసెలో ఉంటూ సంతోషంగానే కాపురం చేశారు. ఇదిలా ఉంటే గతేడాది నర్సింహ బెహర ఉపాది నిమిత్తం గల్ఫ్ కు వెళ్లాడు. అక్కడ కొన్నాళ్ల పాటు పని చేసి ఏడాది తర్వాత తిరిగి సొంతూరికి వచ్చాడు.
వచ్చిన రెండు రోజులు సంతోషంగా ఉన్నాడో లేదో.., అప్పటి నుంచి భర్త నర్సింహ బెహర భార్యను వేధింపులకు గురి చేశాడు. తరుచు భార్యతో గొడవ పడేవాడు. అయితే ఈ నేపథ్యంలోనే శుక్రవారం కూడా భార్యాభర్తలిద్దరూ మరోసారి గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త నర్సింహ బెహర ఇంట్లో ఉన్న డ్రిల్లింగ్ మిషన్ ఆన్ చేసి భార్యను హత్య చేశాడు. ఈ దాడిలో భార్య భవాని ముఖం నుజ్జు నుజ్జు అయింది. భవాని అరుపులు విన్న స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరించారు. ఇక చికిత్స పొందుతూ చివరికి భవాని ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.