ప్రతి కంపెనీ తమ సంస్థ అభివృద్ధి, లాభాల కోసం అనేక సంస్కరణలు తీసుకొస్తుటుంది. లాభాల కోసం ఉద్యోగులపై పని ఒత్తిడి తెచ్చే ప్రయత్నలు కొన్ని కంపెనీ చేస్తుంటాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటేనే తమ సంస్థ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని భావిస్తాయి. అయితే తాజాగా ఓ కంపెనీ తమ సంస్థలోని ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన వారికి ఆ సంస్థ ఓ భారీ ఆఫర్ ప్రకటించింది. బరువు తగ్గించుకునే ఉద్యోగులకు రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించింది. మరి.. ఆ కంపెనీ ఏంటి, అసలు ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
‘జెరెధా’ అనే ఓ ఆన్ లైన్ బ్రోకరేజ్ సంస్థ ఈ ఆఫర్ ప్రకటించింది. ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు బరువు పెరిగి అనారోగ్యం బారినపడుతున్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు వారి దరి చేరకూడదరని ఆ సంస్థ భావించింది. దీంతో తమ సంస్థలోని ఉద్యోగులకు కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించింది. ఆరోగ్యంగా ఉంటూ బరువు తగ్గించుకునే ఉద్యోగులకు రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు సంస్థ సీఈవో నితిన్ కామత్ తెలిపారు. ఆ బరువు ఎలా తగ్గించుకోవాలనే దానికి కొన్ని నియమ నిబంధనలు తెలిపారు. రోజుకు 350 కేలరీల కొవ్వును కరిగించుకున్న ఉద్యోగులకు పలు రకాల బహుమతులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
దీంతో ఉద్యోగులు తమ ఫిట్నెస్ ట్రాకర్ పరికరాల్లో రోజువారీగా ఎంత కొవ్వును కరిగించాల్సి ఉంటుందన్న పరిధిని ఏర్పాటు చేస్తామన్నారు. సంస్థ మేనేజ్మెంట్ నిర్దేశించిన కాల పరిమితిలో లక్ష్యాన్ని చేరుకున్న వారికి నెల రోజుల వేతనాన్ని బోనస్ గా అందిస్తారు. అలా బరువు తగ్గిన ఉద్యోగుల మధ్య లక్కీ డ్రా నిర్వహించి.. విజేతకు రూ.10 లక్షల బహుమతిని అందిచనున్ననట్లు నితిన్ తెలిపారు. మరి.. జెరోధా కంపెనీ ప్రకటించిన ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అపర కుబేరుడు ‘గౌతమ్ అదానీ’ ఎలాంటి కార్లు, విమానాలు వాడుతున్నారో చూడండి!
ఇదీ చదవండి: 19 ఏళ్లకే రూ.1000 కోట్ల సంపాదనతో రికార్డుకెక్కిన భారతీయ యువకులు..