సాధారణంగా 19 ఏళ్ల యువకులు మంచి మార్కులు, మంచి ర్యాంకు రావాలంటూ పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. మరికొందరు సినిమాలు, షికార్లు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా టీనేజ్ కుర్రాళ్లు కళాశాలల్లో స్నేహితులకతో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ విద్యార్ధులందిరికి ఆదర్శంగా, డిఫరెంట్ గా 19 ఏళ్లకే వ్యాపార వేత్తగా అవతారం ఎత్తాడు ఓ కుర్రాడు. ఓ చిన్న కంపెనీగా మొదలు పెట్టిన ఆ యువకుడు.. అతి తక్కువ కాలంలోనే దేశమంతటా విస్తరించేలా చేశాడు. అంతే కాకా ఓ అరుదైన రికార్టును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయనే క్విక్ డెలివరీ స్టార్టప్ జెప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రో. అతడి స్నేహితుడు అదిత్ పలీచాతో కలసి ఆ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. కేవలం 19 ఏళ్ల వయసులోనే రూ.1000 కోట్ల నికర విలువ సాధించిన యంగ్ బిజినెస్ మ్యాన్ గా రికార్డు సాధించాడు.
కరోనా లాక్ డౌన్ సమయంలోనే కైవల్య వోహ్రా, అదిత్ పలీచా ల మెదడులో ఈ స్టార్టప్ కంపెనీకి పునాది పడింది. లాక్ డౌన్ సమయంలో ముంబైలో అద్దె ఇంట్లో ఉంటున్న వీరిద్దరూ.. సామాన్యుల మాదిరిగానే నిత్యావసర సరకుల కోసం చాలా ఇబ్బంది పడ్డారు. ఇ సమస్యే వేల కోట్ల కంపెనీగా రూపాంతరం చెందింది. మొదట కైవల్య కిరాణా మార్ట్ పేరుతో ఈ స్టార్టప్ కంపెనీ ఆరంభించాడు. కొంతకాలనికి అదిత్ చేరాడు. ఈ క్రమంలో వారిద్దరిలో అనేక ఆలోచన వచ్చాయి. స్థానిక కిరణా వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక క్షణాల్లో ఇళ్లకు సామాగ్రిని డెలివరీ చేయటం మొదలు పెట్టారు. కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి సమస్యలను గుర్తించేందుకు తొలుత వారిపై వారే ప్రయోగాలు చేసుకున్నారు. ఆ అనుభవాలతో సమస్యలను సరిద్దిుకుంటూ ముందుకు సాగారు.
2021 ఏప్రిల్ లో మంబైలో రూ.458.3 కోట్ల ఆరంభ ఫండింగ్ తో ఆకర్షించిన ఈకంపెనీ ప్రస్తుత సుమారు 1500 మంది సిబ్బందితో వస్తరించి సేవలందిస్తోంది. వీరిద్దరి ఆలోచనలతో ఈ ఏడాది మేలో రూ.1617 కోట్లు వచ్చాయి. దీంతో కంపెనీ విలువ రూ.7000 కోట్లకు పైగా చేరింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఒకటి ఉంది. కైవల్య, అదిత్ లు స్టాన్ ఫర్డ్ లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువును మధ్యలో వదిలేశారు. అయినప్పటికి తమ ఆలోచనతో యువతకు ఆదర్శంగా నిలిచారు.తాజాగా ఐఐఎఫ్ ఎల్ వెల్త్-హురున్ ఇండియా-2022 జాబితాలో ఈ ఇద్దరు చోటు దక్కించుకున్నారు. అతేకాక ఈ జాబితాలో చోటు సాధించిన అతి పిన్న వయస్కులుగా నిలిచారు. 19 ఏళ్ల కైవల్య అత్యంత సంపన్న భారతీయుల్లో పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు.
హురున్ జాబితాలో రూ. 1,000 కోట్ల నికర విలువతో కైవల్య ఓవరాల్ గా 1036వ స్థానంలో ఉన్నాడు. ఆదిత్ పాలిచా రూ. 1,200 కోట్ల నికర విలువతో 950వ స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరూ గతంలోనూ ఇ-కామర్స్ విభాగంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించిన ప్రభావవంతమైన టాప్ 30 అండర్-30 ఆసియా జాబితోనూ చోటు దక్కించుకున్నారు. మరి… అతి చిన్న వయస్సులు అరుదైన రికార్టు సాధించిన ఈ యువకులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.