భారతదేశంలో ఉన్న అతి ప్రధానమైన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఒకటి. ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఎస్బీఐ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఖాతాదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా తన ఖాతాదారులకు ఎస్బీఐ శుభవార్త చెప్పింది. ఫిక్స్ డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగానికి చెందిన ఈ దిగ్గజ బ్యాంకు ప్రకటించింది. అన్ని టెన్యూర్లపై 20 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ఎస్బీఐ తెలిపింది.
ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద బ్యాంకు అంటే అందరు ఠక్కున చెప్పేది స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరే. అంతాల వినియోదారుల్లోకి వెళ్లింది ఈ దిగ్గజ బ్యాంకు. ఇప్పటి వరకు ఈ బ్యాంకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుని అందరిని తనవైపు తిప్పుకుంది. తాజాగా తన బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎస్బీఐ. ఈ బ్యాంకులో ఎవరైనా ఫిక్స్ డిపాజిట్లు ఉంచి ఉంటే..వారికి ప్రస్తుతం అత్యధిక వడ్డీ రేట్లు లభించనున్నాయి. స్టేట్ బ్యాంకు తన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సమీక్షించింది. ఆ సమీక్షలో ఫిక్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు పేర్కొంది. ఆ పెంచిన రేట్లు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. 10 బేసిస్ పాయింట్ల నుంచి 20 బేసిస్ పాయింట్ల మధ్యలో ఈ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని తన వెబ్ సైట్ లో ఎస్బీఐ పేర్కొంది. 7-45 రోజుల వ్యవధిలో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను 2.90 శాతం నుంచి 3 శాతానికి పెంచింది.
అదే విధంగా 46-179 రోజుల వ్వవధి మెచ్యూర్ అయ్యే ఎఫ్ డీలపై 4% వడ్డీని ఇవ్వనుంది. అయితే గతంలో దీనిపై 3.90 శాతం ఉండేది. ఇ క 180-210 రోజుల వ్యవధిలోని రిటైల్ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్ల ఇంట్రస్ట్ రేట్లు..4.55 నుంచి4.65 శాతానికి పెంచింది. 211 రోజుల నుంచి ఏడాది వ్యవధిలో ఉన్న ఫిక్స్ డిపాజిట్లపై 4.6 నుంచి 4.7 శాతంకి పెరిగింది.మూడు సంవత్సరా నుంచి ఐదేళ్ల లోపు వరకు ఉండే ఎఫ్డ్ డీ లకు 5.60 నుంచి 5.80 శాతంకి పెరిగింది.ఇక ఐదేళ్ల నుంచి పదేళ్లే లోపు వరకు ఉండే డిపాజిట్లకు 5.65 నుంచి 5.85 శాతం పెరిగింది. అయితే ఈ కొత్త వడ్డీ రేట్లు రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయంట. రెండు నెలల వ్యవధి తర్వాత..రిటైల్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ఎస్బీఐ పెంచింది. పెంచిన వడ్డీ రేట్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఎస్బీఐ తన వెబ్ సైట్ లో పొందుపర్చింది.