భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ పాలసీలకు పెట్టింది పేరు. అందులోనూ ప్రభుత్వ రంగ సంస్థ అవ్వడం వల్ల దీనిపై ప్రజలకు నమ్మకం కూడా ఎక్కువ. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్ఐసి కూడా సమాజంలోని అన్నీ ఆర్థిక వర్గాలనూ దృష్టిలో ఉంచుకుని స్కీమ్స్ను రూపొందిస్తుంటుంది. అందులోనూ అవగాహనలేమి కారణంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేదానిపై సతమతమయ్యేవారిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు చక్కటి ప్లాన్స్ ఆఫర్ చేస్తుంటుంది. ఎల్ఐసి అందిస్తోన్న అలాంటి ప్లాన్లలో ‘ఎల్ఐసీ జీవన్ లాభ్’ ఒకటి. ఈ పాలసీలో ప్రతి రోజూ రూ.233 పెట్టుబడితో రూ.17 లక్షల మొత్తాన్ని పొందొచ్చు. ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం..
ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ అనేది బీమాపై పొదుపు ఎంపికతో కూడిన ఎండోమెంట్ పాలసీ. ఈ పాలసీకి స్టాక్ మార్కెట్తో సంబంధం ఉండదు. మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురయినా మీ డబ్బుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఒకవేళ ఈ పాలసీ తీసుకున్న కొంతకాలం తర్వాత.. దురదృష్టవశాత్తూ పాలసీదారుడు మరణించినా, నామినీకి ఈ పాలసీ ఆర్థిక సహాయం అందిస్తుంది. అలాగే ఈ పాలసీ తీసుకున్న వారికి కొంతకాలం తర్వాత రుణ సదుపాయం కూడా ఉంటుంది.
మొదట ఇందుకు 16 సంవత్సరాల టర్మ్ పాలసీని ఎంపిక చేసుకోవాలి. రోజుకు రూ.233 చొప్పున.. అంటే నెలకు రూ.7 వేలు పెట్టుబడి పెడుతూపోవాలి. మెచ్యూరిటీ పూర్తయ్యాక రూ.17 లక్షల మొత్తం చేతికి అందుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆదాయ పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద ఈ పాలసీలో పెట్టుబడులకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే అప్పటివరకు చెల్లించిన ప్రీమియంలు అన్నీ తిరిగి చెల్లిస్తారు. నామినీకి డెత్ సమ్ అష్యూర్డ్, సింపుల్ రెవెర్సినరీ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్లుగా అదనంగా అందుతాయి.
— Govardhan Reddy (@gova3555) July 11, 2022