ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)..ఉద్యోగులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. కానీ చాలా మందికి ఈ ఆర్గనైజేషన్ అందించే పూర్తి సేవల గురించి తెలీదు. వాటి గురించి PF ఖాతాదారులు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగి రిటైర్మెంట్ అయితే అతనికి రూ.50 వేల వరకు బోనస్ లభిస్తుంది. మరి ఈ అదనపు ప్రయోజనాన్ని పొందడానికి ఖాతాదారుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఈపీఎఫ్ఓ సంస్థ ఈ అదనపు బోనస్ ను లాయాల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ కింద ఉద్యోగులకు అందిస్తున్నట్లు తెలిపింది. PF ఖాతాదారుడు గత 20 సంవత్సరాలుగా తన ఖాతాలో పీఎఫ్ డబ్బును జమ చేస్తున్నట్లైతే.. ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. పీఎఫ్ నింబంధనల ప్రకారం.. ప్రాథమిక జీతం రూ. 5 వేలు ఉన్న పీఎఫ్ ఖాతాదారులకు రూ.30,000 రూపాయల అదనపు బోనస్ రిటైర్మెంట్ తర్వాత లభిస్తుంది. ఇక 5-10 వేల జీతం ఉన్న ఉద్యోగులకు రూ. 40 వేల బోనస్ లభిస్తుందని సంస్థ పేర్కొంది. ఈ క్రమంలోనే 10 వేల కంటే ఎక్కువ ప్రాథమిక జీతం ఉన్న ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత రూ. 50 వేల రూపాయలు బోనస్ గా లభిస్తుంది. అయితే ఈ ప్రయోజనం 20 సంవత్సరాల ముందే పీఎఫ్ ఖాతా నిలిచిపోయినా మీకు అందుబాటులో ఉంటుంది. కాక పోతే అది మీ ప్రాథమిక జీతాన్ని బట్టి వస్తుంది. పీఎఫ్ ఖాతాదారులకు ఈ విషయాలు తెలియక పోతే సంబంధిత కార్యాలయంలోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అదీ కాక ఈ ప్రయోజనాన్ని పీఎఫ్ ఖాతాదారలు వినియోగించుకోవాలని సంస్థ సూచించింది.