‘బిగ్ బాస్ ఓటీటీ’ ప్రోగ్రామ్ లో ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ విషయంలో మాత్రం కొదవ లేదు. వాళ్లల్లో వాళ్లు కిందా మీద పడి కొట్టుకుని.. తలలు పగలగొట్టుకుని మరీ సదరు ప్రేక్షకుడిని అలరిస్తున్నారు. ఏ చిన్న మాట, ఏ చిన్న పని, ఏ చిన్న టాస్కు గొడవ మాత్రం పక్కా. బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడైనా గ్రూపులు ఏర్పడితే గొడవలు జరుగుతాయి. ఈసారి బిగ్ బాసే గ్రూపులు చేసి పంపినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఏ రేంజ్ లో ఉండబోతోంది అనేది. అందరూ అనుకున్నట్లుగానే లైవ్ స్ట్రీమింగ్ అయినా కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరిన్ని బిగ్ బాస్ ఓటీటీ కథనాల కోసం క్లిక్ చేయండి.
ప్రస్తుతం హౌస్ లో జరుగుతున్న టాస్కులో రచ్చ రచ్చ జరుగుతోంది. ఒక్క టాస్కు వల్ల ఇప్పటికే చాలా యుద్ధాలు జరిగాయి. స్మగ్లింగ్ పేరుతో సీనియర్లు జూనియర్ల తలలు పగలగొట్టారు. బిగ్ బాస్ ఊరుకోడుగా.. ఆ తర్వాత అవకాశం ఇస్తే జూనియర్లు కూడా సీనియర్లకు ఝలక్ ఇచ్చారు. ఆ టాస్కు పుణ్యమా అని మళ్లీ పాత మహేశ్ విట్టా బయటకు వచ్చాడు. రావడమే కాదు ఛాలెంజర్స్ పై చెలరేగిపోతున్నాడు. అప్పట్లో వితికా- వరుణ్ సందేశ్ తో జరిగిన గొడవనాటి మహేశ్ విట్టాను చూశారు.
ఇదీ చదవండి: Bigg Boss OTT: నావి ఎందుకు పట్టుకున్నావ్? యాంకర్ శివపై చిందులేసిన తేజశ్విని
స్మగ్లింగ్ లో మూడో కన్సైన్మెంట్ సమయంలో అనీల్ చెక్పోస్టు దగ్గరకు వచ్చి నీళ్లు విసురుతాడు. అవి మహేశ్ పై పడగానే ఎవడ్రా పోసింది అంటాడు. అంతే ఇంక అగ్గి రాజుకుంటుంది. అందుకు అనీల్ రాథోడ్ ఎవరు వేశారు అని అడుగు అంతేగానీ, అరే గిరే అంటే నడవదు బ్రో అంటాడు. అప్పటికే టాస్కు ఓడిపోతామనే భయంలో ఉన్న మహేశ్ ఇంక అనీల్ పై కేకలు వేసేశాడు. అంటాను ఏం చేస్తావో చేసుకో అని మీదకు వెళ్తాడు. అనీల్ కూడా చేతులు పట్టుకున్న అజయ్ ని విదిలించుకుని మహేశ్ పైకి వెళ్తాడు. ఆ విధంగా ఒక్క టాస్కుతో ఇంట్లో చాలానే గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలో తప్పు ఎవరది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.