ప్రస్తుతం ఏపీ రాజకీయలు వాడీవేడిగా ఉన్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న టీడీపీ ఈసారి ఎలాగైనా గెలవాలని ఆలోచనతో ఉండగా.. 175 స్థానాలకి 175 గెలుపొందడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందుకు తగ్గటు ప్రత్యేక ప్రణాళికతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా సీఎం ముందు కుప్పంను టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలని.. ఆ దిశగా సీఎం అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కుప్పం నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఈనెల 22న మరోసారి సీఎం వైఎస్ జగన్ కుప్పంలో పర్యటించనున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ చరిత్ర సృష్టించారు. ఆ సమయంలో ఫ్యాన్ గాలికి ఎందరో పెద్ద పెద్ద నాయకులు కొట్టుకపోయారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అనంతరం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోన్నారు. ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన..అవేమి లెక్క చేయకుండా ప్రజలకు మంచి చేయాలనే తపనతో ముందుకు వెళ్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమ వైసీపీలో ఉంది. అయితే 175 స్థానాలకు 175 స్థానాలకు గెలవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులు టార్గెట్ ఫిక్స్ చేశారు.
అందులో భాగంగా మొదట కుప్పను జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. 2019 కుప్పం ఫలితాల్లో ఒకానొక్క దశలో చంద్రబాబు వెనకంజలో ఉన్నారు. చంద్రమౌళిపై తక్కువ మెజార్టీతో చంద్రబాబు గెలుపొందారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం మొత్తం వైసీపీ జెండ ఎగిరింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించడం పెద్ద కష్టం కాదని సీఎం జగన్ నియోజకవర్గ నేతలకు తెలిపారు.కుప్పంలో వైసీపీ జెండా ఎగరడమే లక్ష్యంగా ఇప్పటికే ఆ నియోజకవర్గ కార్యకర్తలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కుప్పంపై వరాల జల్లు కురిపించారు రెండు వారాల క్రితం.. చంద్రబాబును ఓడిస్తే మంత్రి పదవి ఇస్తాను అంటూ బహిరంగ ఆఫర్ ప్రకటించారు.
ఇలా కుప్పంలో గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 22న కుప్పం లో పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా కుప్పంలో ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. కుప్పంలో దారి పొడవునా, గోడల పైనా ‘ఫస్ట్ టార్గెట్ కుప్పం’ అంటూ.. 175 / 175 సీట్లు అంటూ పెయింటింగ్ లతో వైసీపీ నేతలు ప్రచారం చేస్తోన్నారు. జగన్ కుప్పం పర్యటన విజయవంతం చేసేలా వైసీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామిలు ఎప్పటికప్పుడు పరీశీలిస్తున్నారు. హెలిపాడ్, బహిరంగ సభ స్థలాలను పరిశీలించారు. చేయూత కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనున్నారని మంత్రులు వివరించారు. మరి.. ఈ విషయంపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.