విహారయాత్ర అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ముఖ్యంగా విద్యార్ధులకు, పిల్లలు అయితే కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. దీంతో కాలేజీలు, పాఠశాల యాజమాన్యం విద్యార్ధులను అప్పుడప్పుడు విహారయాత్రలకు తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని సార్లు ఈ విహారయాత్రులు విషాద యాత్రలుగా మారుతున్నాయి. అనుకోని ప్రమాదాల్లో విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో చింతూరు ఏజెన్సీలో విషాదం చోటుచేసుకుంది. సోకిలేరు వాగులో పడి ముగ్గురు టెన్త్ విద్యార్ధులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే..
బాపట్ల జిల్లా వేటపాలెంలోని శ్రీ అనుజ్ఞ హైస్కూల్ నుంచి 29 మంది తో కూడిన బృందం విహారయాత్రకు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీ ప్రాంతంకి వెళ్లింది. ఈ బృందంలో 20 మంది విద్యార్ధులు ముగ్గురు టీచర్లు ఉన్నారు. యాత్రలో భాగంగా సోకిలేరు వాగులో వ్యూపాయింట్ వద్దకు విద్యార్ధులు వెళ్లారు. ఇక్కడ ముగ్గురు టెన్త్ విద్యార్ధులు నదికి అతి సమీపంలోకి వెళ్లి..పొరపాటును నదిలో పడి గల్లంతయ్యారు. నదిలో గల్లంతైన విద్యార్ధులు సువర్ణ కమల, గీతాంజలి, గుమ్మడి జయశ్రీగా గుర్తించారు. గల్లంతైన వారిలో గీతాంజలి అనే విద్యార్ధిని మృతదేహం లభ్యమైంది. అయితే ప్రస్తుతం గల్లంతైన మిగిలిన ఇద్దరు విద్యార్ధుల కోసం గాల్లింపు చర్యలు జరుగుతోన్నాయి. సోకిలేరు వాగును చూసేందుకు ముగ్గురు విద్యార్ధినీలు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నది వద్దకు వెళ్లినట్లు ఓ విద్యార్థి తెలిపాడు. అయితే వారు నిల్చున్న గట్టు ఒక్కసారిగా విరిగిపోవడంతో ముగ్గురు నదిలో పడిపోయినట్లు విద్యార్ధులు తెలిపారు. మరి.. ఈఘటన సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.