Daggubati Venkateswara Rao: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తూండగా ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు పరీక్షలు చేసిన వైద్యులు గుండెపోటు వచ్చిందని తేల్చారు. యాంజియోప్లాస్టి ద్వారా గుండెకు రెండు స్టంట్లు వేశారు. చికిత్స అనంతరం దగ్గుబాటి ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకుందని అపోలో వైద్యులు వెల్లడించారు. దగ్గబాటి వెంకటేశ్వరరావు గుండెపోటు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపోలో ఆసుపత్రికి వెళ్లారు.
అక్కడ దగ్గబాటి వెంకటేశ్వరరరావును పరామర్శించారు. ఆయన సతీమణి పురంధేశ్వరిని, వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దగ్గుబాటి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాసేపు దగ్గుబాటి దంపతులతో కలిసి ముచ్చటించారు. కాగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన కుమారుడిని ప్రకాశం జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దింపాలని చూశారు. కానీ, అతడు అమెరికన్ సిటిజన్ కావడం.. సిటిజన్ షిప్ను రద్దు చేసుకోవడంలో సమస్యలు ఏర్పడటంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీలో నిల్చారు. అయితే, ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పరీక్ష రాసిన 24 ఏళ్ళకి జాబ్ వచ్చింది! కానీ.., మా అమ్మని ఎవరు తెచ్చిస్తారు?