ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం పర్యటించారు. సీఎం హోదాలో ఆయన అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. కుప్పం నియోకజవర్గంలోని అనిమిగానిపల్లిలో ‘వైఎస్సార్ చేయత’ మూడో విడత నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్.. కుప్పానికి నాన్ లోకల్ అంటూ ఎద్దేవా చేశారు. 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో 33 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గానికి మాత్రం ఏమి చేయలేదని విమర్శించారు.
శుక్రవారం కుప్పం పర్యటనకు వెళ్లిని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ డా. గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. కుప్పం చేరుకున్న సీఎం జగన్ కి స్వాగతం పలికేందుకు అక్కడి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇక రోడ్ల పొడవునా సీఎంకి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ చేయుత లో భాగంగా మూడో విడత నగదను విడుదల చేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం జగన్.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని తీవ్రస్థాయిలో విమర్శించారు. కుప్పంపై చంద్రబాబుకు ప్రేమ లేదని ఎద్దేవ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. “చంద్రబాబు కుప్పంను ఏనాడు సొంత గడ్డగా భావించలేదు, హైదరాబాదే ముద్దు అని భావించారు. అందుకే హైదరాబాద్ లో ఇంద్రభవనం లాంటి ఇళ్లు కట్టుకున్నాడు. కుప్పంలో సొంత ఇల్లు కాదు కదా ఓటు కూడా లేదు. చంద్రబాబు హైదరాబాద్ కి లోకల్.. కుప్పానికి నానల్ లోకల్.
కనీసం నియోజక వర్గ ప్రజలకు ఏం కావాలో కూడా ఆ ఆలోచించలేదు. చంద్రబాబు.. కుప్పం నుంచి తనకు కావాల్సినంత రాబట్టుకున్నాడు. దొంగ ఓట్లు వేయించుకోవడంలో బాబుకు ఉన్న అనుభవం గురించి ఈ జిల్లాలో కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఇక ఆయన చేసే మోసాలను భరించేది లేదని, ఇక తలవంచేది లేదని కుప్పం ప్రజలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ గా ఉన్న భరత్ తనతో నాతో ఈ అభివృద్ధి పనులు చేసున్నారు. వచ్చే ఎన్నికల్లో లోకల్ వ్యక్తి అయిన భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తాను. కుప్పం నియోజకవర్గాన్ని కూడా సొంత నియోజకవర్గం భావిస్తాను” అని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మరి.. చంద్రబాబుపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.