YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పర్యటన సందర్భంగా కుప్పంలో ఏర్పాటు చేసిన సభలో వైఎస్సార్ చేయూత మూడో విడుత నిధులను ఆయన విడుదల చేశారు. అనంతరం ప్రజలను ఉద్ధేశించి సీఎం జగన్ మాట్లాడారు. జనవరి నుంచి పెన్షన్ను పెంచుతున్నట్లు ప్రకటించారు. పెన్షన్ను 2500 రూపాయల నుంచి 2750 రూపాయలకు పెంచి అందించనున్నట్లు తెలిపారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ ప్రకారం త్వరలో పెన్షన్ను 3 వేల రూపాయలు చేస్తామని స్పష్టం చేశారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ కుప్పం అంటే బాబు పాలన కాదు. కుప్పం అంటే అక్కాచెల్లెమ్మల అభివృద్ధి. కుప్పం అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి. మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తోంది. అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు తేడా గమనించండి’’ అని అన్నారు.