ఏపీ రైతులకు జగన్ సర్కార్ ఒకేసారి రెండు శుభవార్తలు చెప్పనుంది. వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. ఎందుకు అంటే..
సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది. అది కూడా ఒకటి కాదు రెండు శుభవార్తలు చెప్పింది. రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనుంది. ఆ వివరాలు.. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా అందించే పెట్టుబడి నిధులు విడుదల చేయనున్నారు. ఈ ఏడాదికి సంబంధించి అన్నదాతలకు తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది సర్కార్. అలాగే ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. ఈ నెల 30న కర్నూలు జిల్లా పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి రైతుల అకౌంట్లలో ఇందుకు సంబంధించిన డబ్బుల్ని జమ చేయనున్నారు.
ఈ ఏడాది తొలి విడత పెట్టుబడి సాయంగా రూ.7,500 చొప్పున మొత్త 52.31 లక్షల మంది రైతుల ఖాతాలో రూ.3,934.25 జమ చేస్తారు. పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు.. ఇన్పుట్ సబ్సిడీ కూడా పంపిణీ చేయనున్నారు. ఇక ఈ సంవత్సరంరైతు భరోసా అందుకునే రైతుల సంఖ్య పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కింద అర్హులైన రైతులకు ఏటా మూడువిడతల్లో మొత్తం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి విడతలో భాగంగా మే నెలలో రూ.7,500.. రెండో విడతగా అక్టోబర్లో రూ.4 వేలు, మూడోవిడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు.
ఈ నెలలో అందించనున్న సాయంతో కలిపితే.. ఈ నాలుగేళ్లలో జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా సగటున 52.30 లక్షల మంది అన్నదాతలకు వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.30,996.34 కోట్ల పెట్టుబడి సాయం అందిచినట్లవుతుంది. రైతు భరోసాతో పాటూ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు కూడా సాయం అందిస్తున్నారు సీఎం జగన్. పైగా సీజన్ ముగియకముందే ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) నేరుగా వారి అకౌంట్లలోనే జమ చేస్తూ బాధిత రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గతేడాది డిసెంబర్లో మాండూస్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి 91,237 మంది రైతులకు రూ.76.99 కోట్ల నష్టపరిహారాన్ని ఫిబ్రవరిలో అందజేసిని సంగి తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో కూరిసిన వర్షాలకు నష్టపోయిన రైతులక ఇన్పుట్ సబ్సిడీని మే నెలలో అందించనున్నారు.