మాజీ టీఆర్ఎస్, ప్రస్తుత బీజేపీ నేత ఈటెల రాజేందర్కు, కేసీఆర్కు మధ్య ప్రారంభంలో మంచి సంబంధం ఉండేది. అయితే ఆ తర్వాత వారి మధ్య ఎలాంటి విబేధాలు తలెత్తాయో తెలియదు కానీ ఈటెల మీద భూకబ్జా ఆరోపణలు రావడం, ఆయన పార్టీ వీడటం.. బీజేపీలో చేరటం, హూజారాబాద్ ఉప ఎన్నికలో భారీ విజయం సాధించటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ నేత ఈటెలకు సీఎం కేసీఆర్ లేఖ రాయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కారణం ఏంటంటే నేడు ఈటెల పుట్టినరోజు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈటెలకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: దక్షిణాదిపై కన్నేసిన కేజ్రీవాల్.. త్వరలోనే తెలంగాణలో పాదయాత్ర!
‘‘ఈటెల రాజేందర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా’’ అని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఈటెలకు లేఖ రాశారు. శామీర్పేటలోని ఈటల నివాస చిరునామాకు లేఖ పంపారు. అలానే గవర్నర్ తమిళిసై కూడా ఈటెలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిజారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ చేసి ఈటలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పుట్టిన రోజులప్పుడు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం లేఖలు రాయడం ఆనవాయితీ అని, దీని ప్రకారమే ఈటెలకు సైతం కేసీఆర్ లేఖ రాశారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దీనిసై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: అపూర్వ ఘట్టం.. ఈటలను పలకరించిన కేటీఆర్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.