ఆడవాళ్లకు భూదేవి ఉన్నంత ఓర్పు ఉంటాదని పెద్దలు చెప్తుంటారు. అయితే నేటికాలంలో కొందరు ఆడవాళ్లు ఆ మాటకు భిన్నంగా ఉంటున్నారు. ప్రతి విషయంలో భర్తతో పోటీ పడుతున్నారు. భార్య అనే పదానికి కొత్త అర్ధం చెప్తున్నారు. కొందరు భార్యలు.. తమ మాటకు భర్త ఎదురు చెప్పిన, వాదించిన దారుణాలకు పాల్పడుతున్నారు. వారు ఆత్మహత్య చేసుకోవడం లేదా.. భర్తను హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా జీన్స్ ధరించ వద్దని చెప్పిన భర్తపై ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. విచక్షణ కోల్పోయి భర్తను కత్తితో పొడిచి పొడిచి మరి చంపింది. ఈఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జార్ఖండ్ లోని జామార్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోర్బితా అనే గ్రామంలో పుష్పా హెంబ్రోమ్ అనే మహిళ తన భర్తతో కలిసి జీవిస్తుంది. అయితే శనివారం రాత్రి జీన్స్ ప్యాంటు ధరించి పక్క గ్రామమైన గోపాల్ పూర్ లో జరిగే జాతర చూసేందుకు వెళ్లింది. అక్కడ స్నేహితులతో కలిసి జాతరను తిలకించి తిరిగి ఇంటికి వచ్చింది. అయితే ఆమె వేసుకున్న జీన్స్ పై దంపతుల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. పెళ్లి తర్వాత జీన్స్ ఎందుకు ధరించావన్ని పుష్పాని.. ఆమె భర్త ప్రశ్నించడంతో వారి మధ్య గొడవ మొదలైంది. అది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ భర్తకు ఎదురు సమాధానం చెప్పింది పుష్పా.
దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటా మాటా పెరిగి దాడుల వరకు వెళ్లింది. ఒకరి పై ఒకరు భౌతిక దాడులు కూడా చేసుకున్నారు. దీంతో ఆవేశానికి గురైన పుష్ప.. అక్కడే ఉన్న కత్తితో భర్తపై దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ధన్ బాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. తన కుమారుడికి, కోడలకు మధ్య జీన్స్ ఫ్యాంటు విషయంలో గొడవ జరిగి ఆమె కత్తితో తమ కొడుకును పొడిచి చంపినట్లు మృతుడి తండ్రి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Monkey: దారుణం.. పసికందును భవనం పైనుంచి విసిరికొట్టి చంపిన కోతి!
ఇదీ చదవండి: ‘మా ఆయనను లేపేస్తే.. మనమిద్దరం బాగా ఎంజాయ్ చేయొచ్చు’.. ప్రియుడి కోసం ఓ భార్య ఏం చేసిందంటే!