ఆ మధ్య తెలుగు రాష్గ్రాల్లో కాకినాడ జిల్లా బెండపూడి విద్యార్థులు సంచలనంగా మారిన సంగతి అందరికి తెలిసిందే. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న గ్రామీణ విద్యార్థులు.. అనర్గళంగా అమెరికన్ స్లాంగ్ లో ఇంగ్లీష్ గళగళ మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆ విద్యార్థులను ప్రత్యేకంగా కలిశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇంగ్లిష్ లో అదరగొడుతున్న విద్యార్థుల ప్రతిభ చూసి జగన్ మురిసిపోయారు. ఆమెరికా యాసలో ఇంగ్లీష్ మాట్లాడి.. సీఎం జగన్ మోహన్ రెడ్డి నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని నిడమనూరు ప్రభుత్వ బడిలో చదువుకుంటున్న విద్యార్ధులు కూడా అమెరికన్ స్లాంగ్ లో మాట్లాడి అందరిని ఆకట్టుకున్నారు.
గతంలో బెండపూడి విద్యార్ధులను కొందరు అభినందించగా మరికొందరి ట్రోల్స్ చేశారు. బెండపూడి అనుభవం తరువాత అన్ని పాఠశాల్లో అదే అమెరికన్ యాక్సెంట్ లో విద్యార్థులను మాట్లాడించే ప్రయత్నం అన్ని ప్రభుత్వ పాఠశాల్లో మొదలైంది. అందుకు అనుగుణం చేసిన ప్రయత్నం ఫలిస్తుందని నిడమానూరు ఉపాధ్యాయులు అంటున్నారు. అందరూ విద్యార్ధులు ఆమెరికన్ యాక్సెంట్ మాట్లాడటం లేదని, అయితే ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ అవుతే చాలని, అది అమెరికన్ లేదా వేరే యాక్సెంట్ పర్లేదని అధికారులు తెలిపినట్లు ఉపాధ్యాయులు అన్నారు. కొంత మంది విద్యార్థులు త్వరగా అమెరికన్ ఇంగ్లీష్ ని మాట్లాడతున్నారు. మిగిలిన విద్యార్థులు కూడా ఇండియన్ ఇంగ్లీష్ లేదా ఇతర స్లాంగ్ లో ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయి అమెరికన్ ఇంగ్షీష్ యాక్సెంట్ నేర్చుకునేందుకు కొంత సమయం పడుతుందని టీచర్లు అంటున్నారు.
ఈ శిక్షణతో పిల్లల మాట్లాడే తీరులో మార్పు రావడంతో వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకరావడం పట్ల అభ్యతరాలు, భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నా విద్యార్థులు మాట్లాడే తీరు అందరని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు నిడమానురు విద్యార్ధులు మాట్లాడుతున్న అమెరికన్ స్లాంగ్ అందరిని ఆకట్టుకుంది. వీరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుండటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.