AP CRDA To Auction Amaravati Lands At Rs 10 Crore Per Acre: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రానేలేదు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అంటుండగా.. గతంలో అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని వివాదం కొనసాగుతుండగానే.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి భూముల అమ్మకానికి నిర్ణయం తీసుకుంది. మొత్తం 304.5 ఎకరాలు అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందించింది. ఎకరానికి రూ.10 కోట్ల చొప్పున భూములు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ భూములకు సంబంధించిన వేలం ప్రక్రియ వచ్చే నెలలోనే (జులై) ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయలను కల్పించాల్సి ఉంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు అవసరం. ఈ నేపథ్యంలోనే నిధుల సేకరణకు రాజధాని పరిధిలో ఉన్న భూములను కొంత మేర విక్రయించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ ఇటీవల 389 జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. మున్సిపల్ శాఖ ద్వారా జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో.. వచ్చే నెలలోనే వేలం ద్వారా భూములను విక్రయించాలని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kommu Konam Fish: మత్స్యకారుల వలలో చిక్కిన కోట్లు విలువ చేసే చేపలు
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మెడ్సిటీ నిర్మాణం కోసం గత ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది. అదేవిధంగా లండన్ కింగ్స్ కాలేజీ నిర్మాణం కోసం 148 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ, ఆయా సంస్థలు ఇప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో ఆ భూములను వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. మున్సిపల్ శాఖపై ఇటీవల సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏపీ కేబినెట్ ఆమోదం..!
అలానే గ్రూప్ డీ ఉద్యోగుల కోసం అమరావతిలో నిర్మించిన టవర్స్ని వీఐటీ యూనివర్శిటీకి లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ఏడాదికి 10 కోట్ల రూపాయలు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇక ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతులు, విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: CM Jagan: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఘన విజయంపై స్పందించిన సీఎం జగన్