ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా సౌలభ్యం కోసం పలు ముఖ్యప్రాంతాలను జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కోనసీమ జిల్లా విషయంలో మాత్రం పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పేరు ఏపి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా అంశంపై చర్చకు కొనసాగింది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం కోనసీమ జిల్లాకు ‘అంబేద్కర్ కోనసీమ’ జిల్లా గా పేరు మార్పు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు గా జిల్లాలో నూతన రెవెన్యూ డివిజన్లతో పాటు మండలాలను కూడా ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎవరికైనా ఈ పేరు మార్పుపై అభ్యంతరాలు ఉన్నా.. సూచనలు ఉన్నా స్వీకరించడానికి ఒక నెల రోజులు సమయాన్ని కూడా కేటాయించింది.
ఇక ప్రభుత్వం నిర్ణయం ఇలా ఉంటే.. మరోవైపు కోనసీమ జిల్లాపై వ్యతిరేత వస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ పేరు ఎలా ఉందో అలాగే కొనసాగించాలని.. ప్రభుత్వం కొత పేరు నిర్ణయం తీసుకోకుండా స్టే ఇవ్వాలని హై కోర్టులో ఇప్పటి వరకు పన్నెండు పిటీషన్ల వరకు దాఖలు అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ పిటీషన్లు అన్నింటిపై కలిసి విచారించాలని కోర్టు నిర్ణయించింది. ఇక కోనసీమ జిల్లా పేరు మార్పుపై గత కొన్ని రోజుల నుంచి జిల్లా వాసుల అభిప్రాయాలు సేకరిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.