ఏపిలో వైసీపీ పాలనలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పలు దఫాలుగా ఎన్నికలు జరిగాయి. ప్రతి ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం అందుకుంది. ఈ క్రమంలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉప ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి తనయుడు విక్రమ్ రెడ్డి దాదాపు 82 వేలకు పైగా మెజార్టీ సాధించి ఘన విజయం అందుకున్నారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ వైసీపీ తన ఆదిక్యతను చాటుకుంటూ వచ్చింది. ప్రతీ రౌండ్లోనూ వైసీపీ అభ్యర్థే ముందంజలో ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ అధికార పార్టీ అభ్యర్థి విక్రమ్ రెడ్డికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఇక్కడ మొత్తం 1,02,240 ఓట్లు పోల్ అయ్యాయి.. ఇందులో మేకపాటి విక్రమ్ రెడ్డికి 82,888 ఓట్లు లభించాయి. అలాగే పోస్టల్ బ్యాలెట్ కి సిబంధించి 205 ఓట్లు ఉండగా.. వైసీపీకి 167 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా వైసీపీ ఆదిక్యత చాటుకుంది.
ఆత్మకూరు లో వైసీపీ ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి జగన్ తనదైన శైలిలో స్పందించారు. ‘ ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా… ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి… ప్రతి అవ్వకు, ప్రతి తాతకు… పేరుపేరునా ధన్యవాదాలు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష’ అంటూ ట్విట్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి భరత్కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక్కడ వైఎస్సార్సీపీకి మూడో విజయం. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష! (2/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2022