Viral Video: కుక్కలంటేనే విశ్వాసానికి మారుపేరు. మనం ఓ ముద్ద అన్నం పెడితే చాలు మనపై ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి కుక్కలు. మనం వాటిని కొట్టినా.. తిట్టినా భరిస్తాయి. మనల్ని వదిలిపోవు. మన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాయి. అలాంటి కుక్కలు కరోనా సమయంలో విలవిల్లాడిపోయాయి. ముఖ్యంగా వీధి కుక్కలు. తిండి దొరక్క నానా తంటాలు పడ్డాయి. కొన్ని కుక్కలు తిండి లేక మృత్యువాతపడ్డాయి కూడా. అలాంటి లాక్డౌన్ సమయంలో కొందరు మనసున్న వ్యక్తులు కుక్కలకు తిండిపెట్టారు. ఆ తిండి పెట్టిన వారిని కుక్కలు మర్చిపోలేదు అన్నది నిర్వివాదాంశం.
ఇందుకు తాజాగా, జరిగిన ఓ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ముంబైకి చెందిన ప్రియాంక అనే యువతి లాక్డౌన్లో సమయంలో కొన్ని వీధి కుక్కలకు ఆహారం పెట్టింది. అందులో కోకో అనే కుక్క కూడా ఉంది. లాక్డౌన్ ఎత్తేయగానే ఆమె.. ఆ కుక్క మళ్లీ కలవలేదు. దాదాపు 2 ఏళ్లు గడిచిపోయాయి. రెండేళ్ల తర్వాత తాజాగా, ప్రియాంక ఆఫీస్కు వెళ్లటానికి బస్టాండ్కు వచ్చింది. అయితే, బస్ అప్పటికే వెళ్లిపోయింది. దీంతో ఆమె పక్కనే ఉన్న దుర్గా దేవి మండపం దగ్గరకు దర్శనం కోసం వెళ్లింది. అక్కడ కోకో ఆమెను చూసింది. గుర్తుపట్టింది కూడా. వెంటనే కుయ్,కుయ్ అని అరుచుకుంటూ ఆమె దగ్గరకు వచ్చింది.
తోక ఊపుతూ ఆమె చుట్టూ తిరిగింది. దీంతో ప్రియాంక ఆశ్చర్యానికి గురైంది. అప్పటికప్పుడు ఓ బిస్కెట్ పాకెట్ కొని దానికి పెట్టింది. తర్వాత దేవీ దర్శనం చేసుకుని కోకో దగ్గరకు వచ్చింది. ఆ కోకో ఎంతో ప్రేమ నిండిన కళ్లతో ప్రియాంకను చూసింది. కోకోతో మళ్లీ పరిచయమైన ఈ ఘటనను ప్రియాంక వీడియో తీసింది. దాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కుక్క విశ్వాసానికి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుక్క విశ్వాసం చూపితే ప్రాణాలు ఇస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
A post shared by BHAGYA FEEDS -PRIYANKA CHAUBAL (@straydogfeederandheri)