కొంతమంది రాజకీయ నాయకులు జనాలను ఆకర్షించటానికి వెరైటీ, వెరైటీ స్టంట్లు చేస్తుంటారు. ప్రజలను తమ వైపు తిప్పుకోవటానికి నానా తిప్పలు పడుతుంటారు. వారి ప్రవర్తనకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్లు చేసే పనులు చూస్తే ‘అరే ఏంట్రా ఇది?’ అనిపిస్తుంటుంది. తాజాగా, ఓ ఎంపీ ఎవ్వరూ చేయని పనిని చేశాడు. స్కూల్లో బాలికల టాయిలెట్ కడిగాడు. ‘అందులో అంత వింత ఏముంది?’ అనుకుంటున్నారా?. వింతేకాదు.. విచిత్రం కూడా ఉంది. ఎందుకంటే.. ఆయన ఆ టాయిలెట్ కడిగింది బ్రష్తో కాదు.. ఒట్టి చేత్తో. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో గురువారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్, రేవా ఎంపీ జనార్థన్ మిశ్రా తాజాగా మొక్కలు నాటే కార్యక్రమం కోసం ఓ స్కూలుకు వెళ్లారు. మొక్కలు నాటడం అయిపోయిన తర్వాత స్కూలు టాయిలెట్లు శుభ్రంగా లేవని ఆయన దృష్టికి వచ్చింది. విద్యార్థులు వాటిని వాడటానికి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఆయన రంగంలోకి దిగారు. వాటిని శుభ్రం చేయటానికి పూనుకున్నారు. నేరుగా లేడీస్ టాయిలెట్ దగ్గరకు వెళ్లారు. టాయిలెట్ శుభ్రం చేయటానికి ఆయనకు బ్రష్ కనిపించలేదు. దీంతో ఒట్టి చేత్తో దాన్ని శుభ్రం చేయటం మొదలుపెట్టాడు. టాయిలెట్ను ఎడమ చేత్తో రుద్ది రుద్ది శుభ్రం చేశారు.
అక్కడి వారు దాన్నంతా వీడియో తీశారు. ఆ వీడియోను ఎంపీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల పేర్లను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఎంపీ చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొంత మంది రాజకీయాల కోసం మరీ ఇలాంటి పనులు చేయాలా? అంటూ మండిపడుతున్నారు. మరి, ఈ ఎంపీ ఒట్టి చేత్తో టాయిలెట్ క్లీన్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
पार्टी द्वारा चलाये जा रहे सेवा पखवाड़ा के तहत युवा मोर्चा के द्वारा बालिका विद्यालय खटखरी में वृक्षारोपण कार्यक्रम के उपरांत विद्यालय के शौचालय की सफाई की।@narendramodi @JPNadda @blsanthosh @ChouhanShivraj @vdsharmabjp @HitanandSharma pic.twitter.com/138VDOT0n0
— Janardan Mishra (@Janardan_BJP) September 22, 2022
ఇవి కూడా చదవండి : Viral Video: వైరల్ వీడియో: ATM సెంటర్ను కబ్జా చేసిన ఆవు.. బందుల దొడ్డిగా మార్చేసింది!