ఈ సాంకేతిక యుగంలో శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతాలకు తెరతీస్తున్నారు. సృష్టికి ప్రతిసృష్టిని తయారు చేస్తూ విజ్ఞానశాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలకు కృషి చేస్తున్నారు. తాజాగా మరో అద్భుతాన్ని ఆవిష్కృతం చేశారు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. కృత్రిమ చేపను తయారు చేసి ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ చేప ఈదడానికి కావాల్సిన శక్తి మానవ హృదయ కణాల ద్వారా అందించడం జరుగుతుంది.
హార్వర్డ్ యూనివర్సీటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ చేపను రూపొందించడానికి కాగితం, ప్లాస్టిక్, జెలటిన్ తో పాటు మానవుడి హృదయ కండరాల నుంచి సజీవంగా తీసిన కణాలను ఉపయోగించారు. ఈ కొత్త ప్రయోగం ద్వారా భవిష్యత్తులో మానవ హృదయ సంబంధింత వ్యాధుల సమస్యలకు పరిష్కారానికి ఎంతగానో ఉపయోపడనుంది. ఈ ప్రయోగంతో ఎన్నో అద్భుత మార్పులు రానున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. రానున్న కాలంలో కృతిమ హృదయాలను రూపొందించడానికి ఈ ప్రయోగం కీలకం కానుందని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.ఈ ప్రయోగానికి సంబంధించి హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో కృత్రిమ చేప ఈత కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కృత్రిమ చేపను తయారు చేయండంలో హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందానికి ఎమోరీ యూనివర్సిటీ వారు ఎంతో సహాకారం అందించారు. మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This artificial fish is powered by human heart cells.https://t.co/aioJKFDZft pic.twitter.com/6c5nIbA1sn
— Harvard SEAS (@hseas) February 11, 2022