ఈ మధ్యకాలంలో అనేక కామెడీ షోలు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్ మెంట్ షోల్లో “శ్రీదేవీ డ్రామా కంపెనీ” ఒకటి. ఈ షో వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాందించింది. ప్రతివారం సరికొత్త ఐడియాలతో.. స్పెషల్ గెస్ట్ లతో ఈ షో టీవీ ప్రేక్షకుల మదిలో విశేషంగా ఫేవరేట్ షోగా నిలిచింది. తాజాగా ఈ షోకు సంబంధించి కొత్త ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. ఈ కొత్త ప్రోమో అంతా పంచులు, ఎమోషన్స్ తో నింపేశారు. ప్రోమో బట్టి ఎపిసోడ్ కూడా ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది.
ఈ నెల 6వ తేదీ ఉమెన్స్ డే సందర్భంగా శ్రీదేవీ డ్రామ కంపెనీ షోలో స్పెషల్ ఈవెంట్ జరిగింది. ఈ షోకు ఆర్టిస్టుల తల్లులు, తోబుట్టువులు వచ్చారు. ఎప్పటిలాగే షో ప్రోమో పంచులతో మొదలైంది. ఈ క్రమంలో సీరియాల్ నటీ శ్రీవాణి తో పాటు మరికొంత మంది “ఉమెన్స్ డే” స్పెషల్ సాంగ్ కు ఫర్మార్మెన్స్ ఇచ్చారు. “మగువ, మగువ” సాంగ్ కు సుజాత అండ్ టీం చేసిన ఫర్మార్మెన్స్ అందరిని ఆకట్టుకుంది.”ఏ నోము నోచిందో.. ఏ పూజ చేసిందో” అనే సాంగ్ కి శ్రీవాణి అదిరిపోయే ఫర్మార్మెన్స్ ఇచ్చింది.
అదే సమయంలో ఇమ్మాన్యుయేల్ అమ్మ ఎమోషనలై ఏడ్చేశారు. పాటకు పర్మార్మెన్స్ చూసి ఇమ్మాన్యుయేల్ తల్లి ఎమోషనల్ అయింది. తన కొడుక్కి పెళ్లయిన తర్వాత తన పరిస్థితి కూడా అలానే ఉంటుందేమో అంటూ బోరున ఏడ్చింది. ఇలా షో మొత్తం ఎమోషన్ అండ్ కామోడితో సాగింది. ఈ పవర్ ప్యాక్ ఎమోషన్స్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ప్రోమోపై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.