తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ఏదైనా ముఖ్యమైన అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని విద్యా సంస్థలకు రేపట్నుంచి మూడు రోజులపాటు (సోమ, మంగళ, బుధవారం) సెలవులు ప్రకటించారు. మరో వైపు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నానాయి. ఈ వర్షాలు మరో మూడు నాలుగు రోజుల వరకు భారీగా పడే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి తలసాని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారుల సహాయం కొరకు 040-21111111 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలన్నారు. మరోవైపు కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలో పర్యటించి ప్రజలకు అండగా ఉండాలని కోరారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.