దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరిట తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తోంది షర్మిల. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి తనపై గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి.. సిగ్గుండాలి కదా.. చెప్పుతో కొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి కూడా అదే రేంజ్ లో సమాధానం ఇచ్చారు. వైఎస్సార్ బిడ్డవైతే మునుగోడులో పోటీ చేసి నీ సత్తా ఏంటో చూపించు అంటూ సవాల్ విసిరాడు.
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరిట చేస్తున్న పాదయాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తోంది. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డిపై షర్మిల ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తాను నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్షలు చేస్తుంటే.. మంగళవారం మరదలు అన్నాడు ఓ మంత్రి. ఆయనకు సిగ్గుండాలి. చెప్పుతో కొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా.. మెట్టు(చెప్పు) దెబ్బలు తింటారు జాగ్రత్త అని హెచ్చరించారు. మంత్రి నిరంజన్ రెడ్డి పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడని షర్మిల మండిపడ్డారు. ఆయనకు, కుక్కకు తేడా ఏమైనా ఉందా..? అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. “నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా?” అని షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. షర్మిల చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు.
అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే ఒక్క మాటకు వంద మాటలు అంటామని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల పరిధిలో నూతన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నిరంజన్ రెడ్డి.. షర్మిలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీ తండ్రి ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా ఉండి ఆదాయపు పన్ను కట్టిన వ్యక్తినని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సమయంలోనే తన బిడ్డలను విదేశాల్లో చదివించానని తెలిపారు. వనపర్తి నియోజకవర్గం పరిధిలోని లక్షకుపైగా ఎకరాలకు సాగునీరు తెచ్చిన చరిత్ర తనదని అన్నారు. 22 ఏళ్లుగా తెలంగాణ జెండా పట్టుకుని ప్రజల ఆకాంక్ష కోసం పోరాడిన ఉద్యమకారుడిని తానని చెప్పారు. రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీది అని మండిపడ్డారు. నీవు రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీ చేసి నీ సత్తా ఏంటో చూపించాలని సవాల్ విసిరారు. మరి.. తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.